News September 11, 2025

బాంబ్ బ్లాస్ట్ ములుగు జిల్లా వాసికి గాయాలు

image

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతేవాడ అడవుల్లో మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి తాడ్వాయి మండలం భూపతిపూర్‌కు చెందిన అలం మునేశ్ రెండు కాళ్లు కోల్పోయాడు. గ్రామానికి చెందిన అల్లెం మునేశ్ దంతేవాడ సీఆర్పీఎఫ్ 195 బెటాలియన్‌లో పనిచేస్తున్నాడు. ఈరోజు ఉదయం మందు పాతరలు తొలగించేందుకు వెళ్లగా బాంబుపేలి తీవ్రంగా గాయపడ్డాడు. జవాన్లను వైద్యం కోసం రాయపూర్ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News March 18, 2026

కాకినాడ: ఎట్టకేలకు రూటుమార్చిన పులి.. ఎటువైపు అంటే.?

image

19 రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న పెద్దపులి ఎట్టకేలకు తన గమ్యాన్ని మార్చుకుంది. వారం రోజులుగా ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే తిరుగుతూ బెంబేలెత్తించిన పులి, ఇప్పుడు పొరుగు జిల్లా వైపు మళ్లింది. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రత్తిపాడులోని బాపన్నధార రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా పోలవరం జిల్లా అటవీ ప్రాంతంలోకి పులి వెళ్లినట్లు అటవీ శాఖ అధికారులు ధ్రువీకరించారు.

News March 18, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

♦ డయేరియా ఘటనపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: అచ్చెన్న
♦పాతపట్నం సమస్యలపై ప్రస్తావించిన ఎమ్మెల్యే గోవింద్
♦ టెక్కలి: భూములు ఇవ్వమంటూ రైతుల నిరసన
♦ జిల్లాలో దివ్యంగ శక్తి పథకం ప్రారంభం
♦శ్రీకాకుళం: మామిడి కాయలు కొరత
♦ నరసన్నపేట: జూనియర్ క్రీడా మైదానంలో నాగుపాము సంచారం
♦ టెక్కలి: రెండు నెలలలో ఇద్దరు కిడ్నీ రోగులు మృతి

News March 18, 2026

చీరాల 1 టౌన్ ఎస్ఐ భాస్కరరావు మృతి

image

చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న వల్లాగి భాస్కరరావు బుధవారం మృతిచెందారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఆయనకు ఇంటి వద్ద హార్ట్‌ఎటాక్ వచ్చింది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డీఎస్పీ మొయిన్, సీఐలు సుబ్బారావు, అశోక్ కుమార్, మల్లికార్జునతో పాటు పోలీసులు నివాళులు అర్పించారు. ఆయన 42 ఏళ్ల నుంచి పోలీస్ విభాగంలో సేవలందించారన్నారు.