News September 11, 2025

జూరాల హైలెవల్ బ్రిడ్జి తరలింపుపై ప్రజల ఆగ్రహం

image

ధరూర్ మండలం రేవులపల్లి వద్ద నిర్మించనున్న జూరాల హైలెవల్ బ్రిడ్జి నిర్మాణాన్ని కొత్తపల్లికి తరలించడంపై స్థానిక గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.121.92 కోట్ల వ్యయంతో ఆర్&బీ శాఖ జూలై 1న జీవో జారీ చేసి, అనంతరం ఇరిగేషన్ అధికారులు రేవులపల్లిలో సర్వే కూడా నిర్వహించారు. అయితే వంతెన కొత్తపల్లి-జూరాల మధ్యకు మళ్లించడంతో రేవులపల్లి, చిన్నచింతరేవుల, నర్సందొడ్డి ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News March 12, 2026

SVU: ఏప్రిల్ 15 నుంచి పరీక్షలు ప్రారంభం

image

శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని M.P.Ed/ B.P.Ed/ D.P.Ed 4వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైనట్లు వర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి రాజమాణిక్యం పేర్కొన్నారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి 18 తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలియజేశారు. ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్, మదనపల్లె బీటీ కళాశాలలోని రెండు కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News March 12, 2026

ఆదోనిలో లెటర్ రాసి సూసైడ్

image

ఆదోనిలోని కల్లుబావి వీధిలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. బంధువుల వివరాల మేరకు.. కురువ రాఘవేంద్రకు రెండెకరాలు సొంత పొలం ఉంది. దీంతో పాటు మరో ఐదెకరాలలో వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం, ఇతర ఖర్చుల కోసం రూ.10 లక్షలకు పైగా అప్పులు చేశాడు. వాటిని ఎలా తీర్చాలో తెలియక అయోమయానికి గురై తన చావుకు అప్పులే కారణం అంటూ లెటర్ రాసి ఇంట్లో ఉరేసుకొన్నాడు.

News March 12, 2026

డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్‌కు వాడొద్దు: సివిల్ సప్లై కమిషనర్

image

TG: డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వాడొద్దని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. కృత్రిమ కొరత సృష్టించినా, అక్రమంగా నిల్వ చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాస్ అక్రమ వినియోగంపై టోల్ ఫ్రీ నంబర్ల(1967, 180042500333)కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఇప్పటివరకు జరిగిన తనిఖీల్లో ₹2.36L విలువైన సిలిండర్లను పట్టుకున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 7 కేసులు నమోదయ్యాయని చెప్పారు.