News September 11, 2025
మదనపల్లెలో కిలో టమాటా రూ.20

మదనపల్లె మార్కెట్లో టమాటా ధరలు పడి పోయాయి. గురువారం మార్కెట్కు 125 మెట్రిక్ టన్నుల టమాటాలు రాగా.. వాటిలో మొదటి రకం 10 కిలోల టమాట బాక్స్ రూ.200కు కొనుగోలు చేస్తున్నారు. రెండో రకం రూ.180, మూడో రకం రూ.160 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారని మదనపల్లె టమాటా మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపారు. వ్యాపారులు సిండికేటుగా మారి తమని మోసం చేస్తున్నారని టమాటా రైతులు ఆరోపిస్తున్నారు.
Similar News
News March 3, 2026
గండికోటలో వైష్ణవి హత్య.. మరో అప్డేట్.!

గండికోటలో <<17074128>>జూలై- 14- 2025<<>>లో వైష్ణవి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు జమ్మలమడుగు అర్బన్ CI నరేశ్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా కొంతమంది అనుమానిత ముద్దాయిలను కోర్టు ఉత్తర్వులతో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ గుజరాత్లో అనుమానిత ముద్దాయిపై బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్ష చేయించినట్లు తెలిపారు. ల్యాబ్ రిపోర్ట్ రావడానికి 15-20 రోజులు సమయం పడుతుందన్నారు.
News March 3, 2026
కల్తీ పాలు, బాణసంచా పేలుడు.. పెరిగిన మృతుల సంఖ్య

AP: రాష్ట్రంలో తీవ్ర విషాదం నింపిన కాకినాడ(D) వేట్లపాలెం బాణసంచా పేలుడు <<19266434>>ఘటనలో<<>> మృతుల సంఖ్య 23కి చేరింది. GGHలో చికిత్స పొందుతూ లోవరాజు(38) అనే వ్యక్తి మృతి చెందారు. అటు రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 7కి చేరింది. చౌడేశ్వర్ నగర్కు చెందిన సూర్యారావు(81) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో 13 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
News March 3, 2026
యాదాద్రి: స్వర్ణగిరి ఆలయం మూసివేత..!

చంద్రగ్రహణం నేపథ్యంలో జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని అర్చకులు మూసివేశారు(కవాటబంధనం). రేపు ఉదయం 5 గంటలకు ఆలయ తలుపులు తెరిచి, సంప్రోక్షణ, పుణ్యాహవచనం వంటి శుద్ధి కార్యక్రమాల అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ ధర్మకర్త మానేపల్లి రామారావు తెలిపారు. భక్తులు ఈ విజ్ఞప్తిని గమనించాలని ఆయన కోరారు.


