News September 11, 2025
NRPT: మహిళల రక్షణే షి టీమ్ ప్రధాన లక్ష్యం

మహిళలకు రక్షణ కల్పించేందుకే షి టీమ్ ఏర్పాటు చేశామని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ గురువారం తెలిపారు. ఎక్కడ ఆకతాయిల నుంచి మహిళలకు, విద్యార్థినులకు వేధింపులు, గృహహింస, లైంగిక వేధింపులు ఎదురైతే నిర్భయంగా షి టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. నేరుగా లేదా 87126 70398 ఈ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు.
Similar News
News April 3, 2026
హార్ముజ్ To ఇండియా.. షిప్కు ఎంత టైమ్ పడుతుంది?

ఇరాన్ తీరంలోని హార్ముజ్ జలసంధి నుంచి షిప్స్/ట్యాంకర్లు భారత పశ్చిమ తీరానికి చేరుకోవడానికి లోడు, రూట్ను బట్టి సాధారణంగా 2-3 రోజులు పడుతుంది. సుమారు 1000KM దూరంలోని కాండ్లా(GJ) పోర్టుకు 36-40 గంటల్లో నౌకలు చేరుకుంటాయి. ముంబై(MH)కి రావడానికి 50-55 గంటలు అవుతుంది. ఆయిల్ ట్యాంకర్లు సగటున గంటకు 24-37 KM వేగంతో ప్రయాణిస్తాయి. అమెరికాతో యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ను ఇరాన్ మూసేయడం తెలిసిందే.
News April 3, 2026
BREAKING: పెరిగిన బంగారం ధర

నిన్న భారీగా తగ్గిన బంగారం ధర ఇవాళ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,960 పెరిగి రూ. రూ.1,50,930కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,800 ఎగబాకి రూ.1,38,350 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,55,000గా ఉంది.
News April 3, 2026
ములుగు జిల్లాలోని 85 గొత్తికోయ గ్రామాలకు సోలార్ విద్యుత్

ములుగు జిల్లాలోని 85 గొత్తికోయ గ్రామాలకు సోలార్ విద్యుత్ కనెక్షన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.17 కోట్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా 2,020 కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ అందించనున్నారు. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు స్థిరమైన విద్యుత్ సదుపాయం కల్పించడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నారు. దీంతో గ్రామాల అభివృద్ధికి దోహదం అవుతుందని అధికారులు తెలిపారు.


