News September 11, 2025
అర్హులకు చేయూత ఫించన్ లబ్ధి చేకూరేలా చర్యలు: సిరిసిల్ల కలెక్టర్

చేయూత పింఛన్లపై అవగాహన సమావేశాన్ని స్థానిక కలెక్టరేట్లో అధికారులతో రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం నిర్వహించారు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, నేతన్నలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు తదితరులకు ప్రభుత్వం పింఛన్లు అందజేస్తుందని కలెక్టర్ తెలిపారు. పారదర్శకంగా పంపిణీ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News March 18, 2026
కార్డియో VS యోగా VS స్ట్రెంత్ ట్రైనింగ్.. పొట్ట తగ్గడానికి ఏది బెస్ట్?

ఎక్కువ క్యాలరీలు బర్న్ చేయడంలో కార్డియో టాప్ అయితే, విశ్రాంతి సమయంలోనూ క్యాలరీలు ఖర్చయ్యేలా మెటబాలిజం పెంచడానికి స్ట్రెంత్ ట్రైనింగ్ అవసరం. ఇక యోగా క్యాలరీలు తక్కువగా ఖర్చు చేసినా స్ట్రెస్ హార్మోన్లను తగ్గించి పొట్ట దగ్గర కొవ్వు చేరకుండా చూస్తుంది. వీటన్నింటి కాంబినేషన్ బెస్ట్ రిజల్ట్ ఇస్తుందని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. వీటితో పాటు ప్రొటీన్ ఎక్కువగా ఉండే డైట్ తీసుకోవాలని అంటున్నారు.
News March 18, 2026
శ్రీశైలంలో నేటి పూజా కార్యక్రమాలు

శ్రీశైలంలో ఉగాది ఉత్సవాల్లో భాగంగా బుధవారం..
◆ ఉ.8 గంటల నుంచి చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, జపానుష్ఠానాలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చన, చండీహోమం
◆ సా.5 గంటల నుంచి సాయంకాలార్చనలు, నిత్యహవనాలు,రుద్రహోమం
◆ సా.5:30 గంటలకు ప్రభోత్సవం
◆ రాత్రి శ్రీస్వామి, అమ్మవారికి నందివాహన సేవ, మహాసరస్వతి అలంకారం, కల్యాణ మహోత్సవం, ఏకాంతసేవ
◆ వీరాచార విన్యాసములు, అగ్నిగుండ ప్రవేశం
News March 18, 2026
ఖమ్మం: నీటి ఎద్దడిపై అధికారుల ‘యాక్షన్ ప్లాన్’

ఖమ్మం జిల్లాలో వేసవి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. సమస్యాత్మకమైన 18 గ్రామాలను గుర్తించి, అక్కడ ట్యాంకర్లు లేదా ప్రైవేట్ వనరుల ద్వారా నీటి సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తాగునీటి సమస్యల ఫిర్యాదుల కోసం 1916 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చామని, మరమ్మతుల కోసం సుమారు రూ.90 లక్షలు ఖర్చవుతుందని ఈఈ పుష్పలత తెలిపారు.


