News September 11, 2025

HYD: సా.7 వరకు వర్షం కురిసే ఛాన్స్!

image

సిటీతో పాటు శివారులో ఇప్పటికే వర్షం కురుస్తోంది. ఈ వర్షం సా.7 గంటల వరకు కొనసాగి అవకాశం ఉన్నట్లుగా సైబరాబాద్ పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్, శేర్లింగంపల్లి, కీసర, ఘట్కేసర్, ORR పరిసర ప్రాంతాల్లోనూ అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ప్రజలు ఇందుకు తగ్గట్లుగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. వీలైనంత వరకు బయటకు రాకుండా ఉండటం మంచిదన్నారు.

Similar News

News March 18, 2026

సిరిసిల్ల: వరి ధాన్యం కొనుగోలు సజావుగా చేయాలి: కలెక్టర్

image

వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. యాసంగి సీజన్(2025-26) ధాన్యం కొనుగోళ్లపై వివిధ శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా టెంట్లు, తాగు నీరు, కల్పించాలని కలెక్టర్ అన్నారు.

News March 18, 2026

మొజ్తబాను వెతికి పట్టుకుని చంపేస్తాం: ఇజ్రాయెల్

image

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని వెతికి పట్టుకుని చంపేస్తామని ఇజ్రాయెల్ మిలిటరీ హెచ్చరించింది. ‘ఇజ్రాయెల్‌కు ముప్పు కలిగించే ఎవరినైనా లక్ష్యంగా చేసుకోవడాన్ని కొనసాగిస్తాం. మా దేశానికి వ్యతిరేకంగా చేయి ఎత్తిన వారు మా నుంచి <<19410383>>తప్పించుకోలేరు<<>>. వారిని వెంబడిస్తాం. కనుగొంటాం. హతమారుస్తాం’ అని IDF ప్రతినిధి ఎఫీ డెఫ్రిన్ స్పష్టంచేశారు. అయితే మొజ్తబా ఆచూకీపై తమ వద్ద సమాచారం లేదని చెప్పారు.

News March 18, 2026

తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో నేడు కిసాన్ మేళా

image

కౌడిపల్లి మండలం తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో బుధవారం ‘కిసాన్ మేళా-2026’ నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి స్వప్న జాదవ్ తెలిపారు. సుమారు వెయ్యి మంది రైతులతో నిర్వహించే ఈ మేళాలో ఆధునిక యంత్రాల ప్రదర్శన, శాస్త్రవేత్తలతో ప్రత్యక్ష చర్చలు, సరికొత్త సాగు సాంకేతికతపై అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వ పథకాలపై సమాచారం అందించనున్న ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.