News September 11, 2025
VZM: సంకల్ప్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం

సంకల్ప్ 10 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో స్థానిక స్కిల్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూషన్లో చట్టాలపై గురువారం అవగాహన కల్పించారు. వన్ స్టాప్ సెంటర్, శక్తిసాధన, సఖి నివాసం, 181 ఉమెన్ హెల్ప్లైన్, 1098 చైల్డ్ హెల్ప్లైన్, లింగ సమానత్వం, పోషణ, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టం వంటి అంశాలపై వివరించారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
Similar News
News September 11, 2025
VZM: జిల్లాకి చేరుకున్న 39 మంది యాత్రికులు

మానస సరోవర యాత్రకు వెళ్లి నేపాల్లో చిక్కుపోయిన జిల్లాకు చెందిన యాత్రికుల్లో 39 మంది గురువారం క్షేమంగా చేరుకున్నారు. వీరికి విశాఖ విమానాశ్రయం వద్ద ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, కోళ్ల లలిత కుమారి, బేబీ నాయన స్వాగతం పలికి వారి యోగక్షేమాలను విచారించారు. తమ స్వస్థలాలు చేరుకునేందుకు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ డి.మణికుమార్ ఏర్పాట్లు చేశారు.
News September 11, 2025
VZM: నేలబావిలో పడి వ్యక్తి మృతి

విజయనగరం మండలం రాకొడు గ్రామానికి చెందిన పి.రామారావు (35) ప్రమాదవశాత్తు నేలబావిలో పడి గురువారం మృతి చెందాడు. పశువుల మేతకు గడ్డి కోసం వెళ్లి నేలబావిలో జారి పడినట్లు మృతుని భార్య సంధ్య పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విజయనగరం రూరల్ ఎస్ఐ వి.అశోక్ కుమార్ తెలిపారు.
News September 11, 2025
విజయనగరం కలెక్టర్గా రామసుందర్ రెడ్డి

రాష్ట్రంలో 12 మంది కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఇందులో భాగంగా విజయనగరం కలెక్టర్ డా.బీఆర్.అంబేడ్కర్ను ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో రామసుందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈయన కమిషనర్, రిహాబిలేషన్ & రీసెటిల్మెంట్ అండ్ కమిషనర్ (సీఏడీఏ) నుంచి బదిలీపై వస్తున్నారు.