News September 11, 2025

వరంగల్‌ జిల్లాలో రైల్వే లైన్లను అభివృద్ధి చేయాలి: CM

image

తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రాజెక్టుల విషయాలపై రైల్వేతో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వరంగల్‌ జిల్లాలో రైల్వే లైన్లను అభివృద్ధి చేయాలని, భూపాలపల్లి నుంచి వరంగల్ కొత్త మార్గాన్ని పరిశీలించాలని చెప్పారు. కాజీపేట జంక్షన్‌లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం అన్నారు.

Similar News

News September 12, 2025

సంగారెడ్డి: దరఖాస్తుల ఆహ్వానం

image

2025-26 సంవత్సరానికి విద్యార్థి విజ్ఞాన్ మంథన్ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. 6 నుంచి 11వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులని చెప్పారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్నందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News September 12, 2025

డిగ్రీలో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు

image

TG: డిగ్రీ కాలేజీల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ నెల 12న ఖాళీ సీట్ల వివరాలను నోటీసు బోర్డుల్లో, <>వెబ్‌సైట్‌లో<<>> పెట్టాలని కాలేజీలను ఆదేశించింది. లోకల్ విద్యార్థులకు ఈ నెల 15, 16 తేదీల్లో, నాన్ లోకల్ వారికి 18, 19 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు చేపట్టాలని సూచించింది. ఈ నెల 20న ప్రవేశాల వివరాలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని పేర్కొంది.

News September 12, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 12, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.51 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.04 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.12 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.36 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.21 గంటలకు
✒ ఇష: రాత్రి 7.33 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.