News September 11, 2025
తెలుగు వారికి అండగా ఉంటాం: పల్లా శ్రీనివాస్

టీడీపీ ఎల్లప్పుడూ తెలుగు వారి యోగా క్షేమాలు చూస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. నేపాల్లో చిక్కుకున్న తెలుగువారి కోసం నారా లోకేశ్ అన్ని ఏర్పాట్లు చేశాలని తెలిపారు. వారిని వైజాగ్ తీసుకొచ్చి వారి ప్రాంతాలకు పంపే ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రుషికేశ్లో వరదల సమయం, ఉక్రెయిన్ వార్ సమయంలో ఇలాంటి విపత్కర పరిస్థితిలో తెలుగు వారికి టీడీపీ అండగా ఉందని గుర్తు చేశారు.
Similar News
News March 17, 2026
విశాఖ తీరంలో మృతదేహం కలకలం

విశాఖ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి వైఎంసీఏ బీచ్ సమీపంలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 50 నుంచి 60 ఏళ్ల వయస్సు గల వ్యక్తి సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. త్రీటౌన్ సీఐ పైడయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడిని గుర్తించిన వారు వెంటనే త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.
News March 17, 2026
విశాఖ: ఒకే వేదికపై ప్రత్యర్థులు

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దంపతుల 40వ వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గత ఎన్నికల్లో పరస్పర విమర్శలతో హోరెత్తించిన గంటా, అవంతి శ్రీనివాసరావు ఈ వేడుకలో చెట్టాపట్టాల్ వేసుకొని కనిపించడం విశేషం. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, తదితర ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.
News March 17, 2026
ఎట్టకేలకు విశాఖ డీఆర్వో పోస్టు భర్తీ

విశాఖ జిల్లాలో కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్న డీఆర్వో పోస్టును రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. కడప జిల్లా డీఆర్వో (స్పెషల్ గ్రెడ్ డిప్యూటీ కలెక్టర్)గా ఉన్న ఎం.విశ్వేశ్వర నాయుడును విశాఖకు బదిలీ చేసింది. గతేడాది అక్టోబర్లో ఆర్డీవో శ్రీలేఖ, డీఆర్వో భవాని శంకర్ మధ్య విభేదాల కారణంగా ఇద్దరినీ రిలీవ్ చేశారు. అప్పటి నుంచి పోస్టు ఖాళీగా ఉండగా, తాజా నియామకంతో అనిశ్చితికి ముగింపు పలికింది.


