News September 11, 2025

WNP: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి

image

ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంకా నిర్మాణాలు మొదలు పెట్టని లబ్ధిదారులతో గ్రౌండింగ్ చేయించే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో ఇందిరమ్మ ఇండ్లపై కలెక్టర్ అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి ఎంపీడీవోలతో వెబ్ ఎక్స్ సమావేశం నిర్వహించారు. వార్డ్ ఆఫీసర్లతో లబ్ధిదారులందరినీ పిలిపించి గ్రౌండ్ చేసుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News March 23, 2026

రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడి.. నేడు ఆర్సెలార్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన

image

AP: అనకాపల్లి(D) నక్కపల్లి(M)లో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ప్లాంట్‌కు CM CBN ఇవాళ సాయంత్రం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి Dy.CM పవన్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. దాదాపు రూ.లక్షన్నర కోట్ల పెట్టుబడితో నిర్మించే ఈ ప్లాంట్ వల్ల 1.25L మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. 2029 నాటికి ఉత్పత్తి ప్రారంభించి 2033కు పనులు పూర్తిచేయాలనేది లక్ష్యం.

News March 23, 2026

హార్ముజ్‌లో గర్జిస్తున్న పాత యుద్ధ విమానం

image

అమెరికా ఎయిర్ ఫోర్స్ రిటైర్ చేయాలనుకున్న పాత యుద్ధ విమానం ‘A-10 థండర్‌బోల్ట్’ (Warthog) ఇప్పుడు హార్ముజ్ జలసంధిలో ఇరాన్ స్పీడ్ బోట్లను వేటాడటంలో కీలకంగా మారింది. నిమిషానికి 3,900 రౌండ్లు కాల్చే దీని పవర్‌ఫుల్ గన్ శత్రువులకు వణుకు పుట్టిస్తోంది. ఆధునిక F-35 విమానాలు ఖరీదైనవి కావడంతో తక్కువ ఎత్తులో ఎగురుతూ దాడులను తట్టుకోగల ఈ ‘ఫ్లయింగ్ ట్యాంక్’ సామర్థ్యం ఇప్పుడు అమెరికాకు వరంగా మారింది.

News March 23, 2026

వెదురుకుప్పం: జల్లికట్టులో విషాదం.. 3 ఎద్దులు మృతి

image

వెదురుకుప్పం మండలంలో జరిగిన జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. మూడు ఎద్దులు చెరువులో పడి మృతిచెందాయి. వెదురుకుప్పం మండలం పాతగుంట గ్రామంలో ఆదివారం జల్లికట్టు వేడుకలు నిర్వహించారు. జల్లికట్టు చూసేందుకు సమీప గ్రామస్థులు పెద్ద ఎత్తున రావడం, డప్పు వాయిద్యాలకు జల్లికట్టులో బెదిరిన ఎద్దులు చెరువులో దూకడంతో మృతి చెందాయి. వ్యవసాయానికి ఉపయోగపడుతున్న ఎద్దులు మృతి చెందడంతో రైతులు విలపిస్తున్నారు.