News September 11, 2025

అనంతపురం, సత్యసాయి జిల్లాల కలెక్టర్లు బదిలీ

image

రాష్ట్ర ప్రభుత్వం 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లు డా.వినోద్ కుమార్, టీఎస్ చేతన్‌ బదిలీ అయ్యారు. అనంతపురం జిల్లాకు నూతన కలెక్టర్‌గా ఆనంద్, సత్యసాయి జిల్లా కలెక్టర్‌గా శ్యామ్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Similar News

News March 16, 2026

ఉండవెల్లి: తల్లి కళ్లముందే తనువు చాలించిన కుమారుడు

image

తల్లి కళ్ళముందే తనయుడు తనువు చాలించిన విషాదకరమైన ఘటన ఉండవెల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఉండవెల్లికి చెందిన మజ్హర్‌, తన తల్లి సత్తాజ్ బేగంతో కలిసి బైక్ పై కర్నూల్‌లో కంప్యూటర్ కోచింగ్‌కి బయలుదేరాడు. సరిగ్గా 44వ జాతీయ రహదారిపై ఉత్తర ఫ్రూట్స్ సమీపంలో బైకు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్ర గాయాలతో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని స్థానికులు తెలిపారు.

News March 16, 2026

పెద్దపల్లి: హెచ్‌టీ సర్వీసులకు సింగిల్ విండో విధానం

image

హెచ్‌టీ 11 కేవీ, 33 కేవీపై వోల్టేజ్ విద్యుత్ సర్వీసుల మంజూరును వేగవంతం చేసేందుకు సింగిల్ విండో వ్యవస్థ ఉపయోగపడుతుందని PDPL సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ గంగాధర్ తెలిపారు. ఇప్పటివరకు ఈ విధానం ద్వారా 542 సర్వీసులు మంజూరు చేసినట్లు చెప్పారు. దరఖాస్తులను TGNPDCL పోర్టల్‌లో నమోదు చేసుకుని ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసుకునే సౌకర్యం కల్పించడంతో పారదర్శకత పెరిగిందన్నారు.

News March 16, 2026

అందరికీ ధన్యవాదాల: అనంత కలెక్టర్

image

గుత్తి పట్టణంలో తొలిసారిగా రెండు రోజులపాటు నిర్వహించిన గుత్తి కోట ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో కార్యక్రమాలు ఘనంగా జరిగాయని పేర్కొన్నారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు. ఉత్సవాలను విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.