News September 11, 2025
తాతయ్యగుంట గంగమ్మ సేవకులు వీరే:

తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయ పాలకమండలిని ఏర్పాటు చేస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. సభ్యుల వివరాలు:
☞ మహేష్ యాదవ్ ☞ గుణ ☞ భాగ్యవల్లి ☞ రాజా రుద్ర కిషోర్
☞ వరలక్ష్మి ☞ విమల ☞ చంద్రశేఖర్ ☞ శ్యామల ☞ మధులత
☞ లక్ష్మణరావు.
☞ మొత్తం 41 మంది పేర్లు పరిశీలనకు వెళ్లాయి.
☞ వీరిలో మహేష్ యాదవ్ ఛైర్మన్గా నియామకం అయ్యే అవకాశం ఉంది.
Similar News
News March 12, 2026
చరిత్రలో ఈ రోజు (మార్చి 12)

1930: మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభం
1962: ఆంధ్రప్రదేశ్ మూడవ ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి ప్రమాణ స్వీకారం
1963: సినిమా ఎడిటర్, 9 జాతీయ సినీ అవార్డులు గెలుచుకున్న అక్కినేని శ్రీకర్ ప్రసాద్ జననం
1984: సింగర్ శ్రేయా ఘోషల్ జననం
1993: ముంబైలో వరుస బాంబు పేలుళ్లు.. 257 మంది మృతి
2022: సినీ గీత రచయిత కందికొండ యాదగిరి మరణం
News March 12, 2026
ఈ తేదీల్లో చించినాడ బ్రిడ్జిపై రాకపోకలు బంద్

యలమంచిలి(M) చించినాడ వంతెనపై మరమ్మత్తు పనుల దృష్ట్యా వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు నరసాపురం ఆర్డీవో దాసిరాజు తెలిపారు. మార్చి 15, 18, 21, 24, 27, 30 తేదీల్లో రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు వంతెనపై ఎటువంటి వాహనాలను అనుమతించరు. తమ ప్రయాణ సమయాలను మార్చుకోవాలని ఆయన సూచించారు. ఆయా తేదీల్లో ప్రయాణం చేసే వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలన్నారు.
News March 12, 2026
‘సాగర్కు కొత్త దారి’.. అధికారులకు సీఎం ఆదేశం!

రోడ్లు, భవనాల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పాల్గొన్న ఈ భేటీలో సీఎం కీలక ఆదేశాలిచ్చారు. హైదరాబాద్-విజయవాడ ఎక్స్ప్రెస్ వే నుంచి నాగార్జునసాగర్కు త్వరితగతిన చేరుకునేలా నూతన గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణంపై అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు. ఈ సరికొత్త రోడ్డు పూర్తయితే ట్రాఫిక్ కష్టాలు తీరి, సాగర్ పర్యాటకంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా ముఖచిత్రం మారనుంది.


