News September 11, 2025
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ బదిలీ

సాధారణ బదిలీల్లో భాగంగా గురువారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో కీర్తి చేకూరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కీర్తి చేకూరి స్వస్థలం వైజాగ్, ఆమె ఐఐటీ మద్రాస్లో ఇంజినీరింగ్ చేశారు. గతంలో గుంటూరు నగర కమిషనర్గా, ఏపీ ట్రాన్స్కో జేఎండీగా పనిచేశారు.
Similar News
News September 12, 2025
రాజమండ్రి: ధాన్యం సేకరణకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

అక్టోబర్ 2వ వారం నుంచి ఖరీఫ్ వరి ధాన్యం సేకరించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి అధికారులను ఆదేశించారు. గురువారం రాజమండ్రిలో జరిగిన జిల్లా సేకరణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ ఏడాది గ్రేడ్ ‘ఏ’ రకానికి క్వింటాకు రూ.2,389, సాధారణ రకానికి క్వింటాకు రూ.2,369 మద్దతు ధరగా నిర్ణయించినట్లు తెలిపారు.
News September 11, 2025
తూర్పులో కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్

తూర్పుగోదావరి జిల్లాలో డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు గత రాత్రి 462 వాహనాలను తనిఖీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 9 మందిపై, బహిరంగంగా మద్యం తాగుతున్న 140 మందిపై కేసులు నమోదు చేశారు. రికార్డులు లేని 42 వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
News September 11, 2025
మహిళలు ముందుండాలి: కలెక్టర్ పి. ప్రశాంతి

హుకుంపేటలోని జిల్లా సమాఖ్య కార్యాలయంలో గురువారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి కలెక్టర్ పి. ప్రశాంతి హాజరయ్యారు. రెండు దశాబ్దాలుగా స్వయం సహాయక సంఘాల రుణాల మంజూరులో వచ్చిన మార్పులను ఆమె కొనియాడారు. ఆర్థిక సాధికారతతో పాటు, సామాజిక మార్పులోనూ మహిళలు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు.