News September 11, 2025
తెలుగు రాష్ట్రాల్లో కోటీశ్వరులు ఎందరంటే?

గతేడాది ట్యాక్స్ రిటర్న్స్ డేటా ప్రకారం రూ.కోటి అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి. మన దేశంలో అధికంగా మహారాష్ట్రలో 1,24,800 మంది కోటీశ్వరులున్నారు. ఆ తర్వాత యూపీలో 24,050, మధ్యప్రదేశ్లో 8,666, తమిళనాడులో 6,288 మంది ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్లో 5,340, తెలంగాణలో 1,260 మంది ఉండటం గమనార్హం. ఇక లద్దాక్లో ముగ్గురు, లక్షద్వీప్లో ఒకరు మాత్రమే ఉన్నారు.
Similar News
News March 3, 2026
‘హార్ముజ్’ బంద్.. మనకు ఆయిల్ ఎలా..?

హార్ముజ్ జలసంధిని ఇరాన్ <<19288027>>మూసేయడం<<>> తెలిసిందే. దీంతో దిగుమతులకు అంతరాయం కలిగితే మనపై పడే ప్రభావం గురించి చర్చ జరుగుతోంది. ఇండియా రోజూ 5 మిలియన్ బ్యారెల్స్ చమురు దిగుమతి చేసుకుంటుండగా, ఈ జలసంధి గుండా 2.5MB వస్తోంది. ప్రస్తుతం మన వద్ద 40-45 రోజులకు సరిపడా స్టాక్ ఉన్నట్లు ‘Kpler’ చెప్పింది. స్టోరేజీ ట్యాంకులు, రిజర్వులు, దేశం వైపు వచ్చే నౌకల్లో 100 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ నిల్వ ఉన్నట్లు తెలిపింది.
News March 3, 2026
మా బాడీని జూమ్ చేసి వీడియోలు తీయకండి: హీరోయిన్

నటీమణులను అసభ్యకరంగా ఫొటోలు, వీడియోలు తీయడంపై ‘కాంతార’ నటి సప్తమి గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనే మహిళా కళాకారులను అభ్యంతరకర యాంగిల్స్లో ఫొటోలు, వీడియోలు తీస్తున్నారని మండిపడ్డారు. ఫీమేల్ యాక్టర్స్ శరీర భాగాలను జూమ్ చేసి ఫొటోలు తీస్తూ వాటిని SMలో పోస్ట్ చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఇలాంటి పనులు మానుకోవాలని, క్రమశిక్షణ పాటించాలని ఆమె డిమాండ్ చేశారు.
News March 3, 2026
ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ దాడి

ఇరాన్ అధ్యక్ష భవనంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ‘కచ్చితమైన నిఘా సమాచారం ఆధారంగా టెహ్రాన్లోని ప్రభుత్వ లీడర్షిప్ కాంపౌండ్పై అటాక్ చేశాం. అధ్యక్ష కార్యాలయం, సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, మిలిటరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్పై బాంబులు వేశాం’ అని ఓ ప్రకటనలో IDF తెలిపింది.


