News September 11, 2025
గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్ల బదిలీ

రాష్ట్ర ప్రభుత్వం 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లు నాగలక్ష్మి, అరుణ్ కుమార్ బదిలీ అయ్యారు. గుంటూరు జిల్లాకు నూతన కలెక్టర్గా తమీమ్ అన్సారియా, పల్నాడు జిల్లా కలెక్టర్గా కృతికా శుక్ల నియమితులయ్యారు. తమీమ్ అన్సారియా ప్రస్తుతం ప్రకాశం జిల్లా కలెక్టర్గా, కృతికా శుక్ల గతంలో కాకినాడ జిల్లా కలెక్టర్గా పని చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Similar News
News March 17, 2026
భీమవరం: ‘ఎండ తీవ్రతను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’

రాబోయే వేసవిలో ఎండ తీవ్రతను ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలి కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో భీమవరం కలెక్టరేట్లో సమీక్ష సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ప్రజలు అధికంగా రాకపోకలు చేసే ముఖ్య కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రులు, పాఠశాలలు వంటి ప్రదేశాలను గుర్తించి అక్కడ తాగునీటి సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
News March 17, 2026
‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ పేరు మార్పు.. స్పందించిన డైరెక్టర్

సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ మూవీ <<19398040>>పేరును<<>> ‘మాతృభూమి’గా మార్చడం తెలిసిందే. దీనిపై మూవీ డైరెక్టర్ అపూర్వ లాఖియా స్పందించారు. ‘ఇది రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదు. ముందుగానే 2 టైటిల్స్ నమోదు చేసుకున్నాం. మానవత్వం, సానుభూతి, మన సైనికుల నిశ్శబ్ద పోరాటాల గురించి మూవీ తెలియజేస్తుంది. కొత్త టైటిల్ చిత్రంలోని భావోద్వేగాన్ని మరింత ప్రతిబింబిస్తుంది’ అని తెలిపారు.
News March 17, 2026
ఇరాన్ సుప్రీంలీడర్ రష్యాలో ఉన్నారా?

US, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా <<19366915>>గాయపడినట్లు <<>>వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రష్యా మిలిటరీ విమానంలో రహస్యంగా ఆయన్ను మాస్కో తరలించారని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. అక్కడ విజయవంతంగా మొజ్తబాకు సర్జరీ చేసినట్లు కథనాల్లో పేర్కొంది. మరోవైపు సుప్రీంలీడర్ క్షేమంగానే ఉన్నారని ఇరాన్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఇస్మాయిల్ తెలిపారు. ఎక్కడ ఉన్నారనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.


