News September 11, 2025

ముగిసిన వెంకటగిరి జాతర.. వెళ్లిరా పోలేరమ్మా..!

image

వెంకటగిరిలో పోలేరమ్మ జాతర ముగిసింది. పొలి చల్లడం పూర్తి అయ్యాక ఊరేగింపునకు సిద్ధం చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన పూల రథంపై అమ్మవారిని ఉంచి సాయంత్రం 5 గంటలు దాటాక నగరోత్సవం ప్రారంభించారు. ఆర్చి సెంటర్ నుంచి రాజావారి వీధి, కాశీపేట, శివాలయం మీదుగా మల్లమ్మ గుడి వీధిలోని విరూపణ మండపం వరకు ఊరేగింపు జరిగింది. ‘ వెళ్లి రా పోలేరమ్మా ‘ అంటూ భక్తులు ఘన వీడ్కోలు పలికారు. 2.30 గంటలు ఊరేగింపు జరిగింది.

Similar News

News March 12, 2026

నెల్లూరు జిల్లాలో పెట్రోల్ పట్టడం లేదా…?

image

యుద్ధం ఎఫెక్ట్‌తో నెల్లూరు జిల్లాలో గ్యాస్ డెలివరీ ఆలస్యం అవుతోంది. బుకింగ్ OTPలు రావడం లేదు. కావలిలో కొందరు పెట్రోల్, డీజిల్ రావడం లేదని బంకులు మూసేస్తున్నారని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు మల్లి ఆరోపించారు. జేసీబీ, మైనింగ్ లారీలకు బ్లాక్ మార్కెట్లో డీజిల్ విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. మీ ఏరియాలోనూ పెట్రోల్ బంకుల్లో ఇలాంటి సమస్య ఉంటే కామెంట్ చేయండి.

News March 12, 2026

నెల్లూరు కలెక్టర్‌పై CM ప్రశంసలు

image

జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే “వన్ మంత్ – వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసినందుకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. బుధవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో CM మాట్లాడారు. ఈ వినూత్న విధానం ద్వారా గ్రామ స్థాయిలో భూ వివాదాలను గుర్తించి, దశలవారీగా పరిష్కరించడం జరుగుతుందన్నారు.

News March 11, 2026

నెల్లూరు కలెక్టర్‌పై CM ప్రశంసలు

image

జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే “వన్ మంత్ – వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసినందుకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. బుధవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో CM మాట్లాడారు. ఈ వినూత్న విధానం ద్వారా గ్రామ స్థాయిలో భూ వివాదాలను గుర్తించి, దశలవారీగా పరిష్కరించడం జరుగుతుందన్నారు.