News September 11, 2025

HYD: అటవీశాఖ అధికారుల త్యాగం చిరస్మరణీయం: మంత్రి

image

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అటవీ శాఖ అధికారుల త్యాగం చిరస్మరణీయమని మంత్రి కొండా సురేఖ అన్నారు. నెహ్రూ జులాజికల్ పార్కులో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ డా.జితేందర్, పీసీసీఎఫ్ సువర్ణ, కలెక్టర్ హరిచందనలతో కలసి అమరులకు పూలతో శ్రద్ధాంజలి ఘటించారు.

Similar News

News September 12, 2025

KCR పరిపాలన కోల్పోవడం దురదృష్టం: సబితారెడ్డి

image

KCR పరిపాలన కోల్పోవడం తెలంగాణ ప్రజల దురదృష్టం అని MLA సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం షాబాద్‌లో మాజీ ZPTC అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఏ ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు వచ్చినా విజయం BRS దే అని ధీమా వ్యక్తం చేశారు. RSప్రవీణ్ కుమార్, ఆంజనేయులు, కౌశిక్‌రెడ్డి, రాజేందర్ గౌడ్, ప్రభాకర్, శ్రీధర్ రెడ్డి, నరేందర్ ఉన్నారు.

News September 11, 2025

ఎంబీఏ ఈవినింగ్ పరీక్షా ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ ఈవినింగ్ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంబీఏ ఈవినింగ్ రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షా ఫీజును ఈ నెల 18వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.300 అపరాధ రుసుముతో 23వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.

News September 11, 2025

మిలాద్-ఉన్-నబీ, నవరాత్రుల భద్రతపై HYD సీపీ సమీక్ష

image

నగర సీపీ సీవీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నగర పోలీసు అధికారులతో సమావేశమై సెప్టెంబర్ 14న జరగనున్న మిలాద్-ఉన్-నబీ జూలూస్, రాబోయే దుర్గానవరాత్రి వేడుకల భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అధికారులు ప్రణాళికలు వివరించగా, సీపీ కఠినమైన ప్రోటోకాల్స్ పాటించాలని, విభాగాల మధ్య సమన్వయం తప్పనిసరి అని సూచించారు.గణేశ్ నవరాత్రులలో పోలీసుల పనితీరును ప్రశంసించిన ఆయన, రాబోయే పండుగల్లోనూ అదే నిబద్ధత చూపాలన్నారు.