News September 11, 2025
HYD: అటవీశాఖ అధికారుల త్యాగం చిరస్మరణీయం: మంత్రి

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అటవీ శాఖ అధికారుల త్యాగం చిరస్మరణీయమని మంత్రి కొండా సురేఖ అన్నారు. నెహ్రూ జులాజికల్ పార్కులో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ డా.జితేందర్, పీసీసీఎఫ్ సువర్ణ, కలెక్టర్ హరిచందనలతో కలసి అమరులకు పూలతో శ్రద్ధాంజలి ఘటించారు.
Similar News
News March 18, 2026
‘వేదమందిర్’కు జ్యోతిష్కులు కావలెను!

ప్రముఖ ఆధ్యాత్మిక వేదిక ‘వేదమందిర్’ సేవలు మరింత విస్తరించేందుకు జ్యోతిష్కులను నియమించుకుంటోంది. మా లక్షలాది తెలుగు భక్తులకు సరైన మార్గదర్శనం చేసేందుకు నిపుణులైన జ్యోతిష్కులు (Astrologers) కావలెను.
– జ్యోతిషశాస్త్రంలో మంచి పట్టు
– విషయంపై స్పష్టమైన వివరణ ఇచ్చే నైపుణ్యం
మీరు జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉన్నవారైతే వెంటనే సంప్రదించండి!
Click on Whatsapp: <<7337592828>>73375 92828<<>>
News March 18, 2026
HYD: రూల్స్ జాన్తా నై.. ఎగ్జామ్ హాల్లోకి ఫోన్లు..!

పరీక్షా కేంద్రాల్లోకి ఫోన్లు తీసుకెళ్లడం నిషేధం. కానీ పదో తరగతి పరీక్షల నిర్వహణలో HYD, పెద్దపల్లి జిల్లాల్లోని 12% కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు బయోమెట్రిక్ హాజరు తర్వాత కూడా ఫోన్లను తమవద్దే ఉంచుకుంటున్నట్లు విజిలెన్స్ తనిఖీల్లో వెల్లడైంది. కొన్నిచోట్ల వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం బయటకు వెళ్తోందన్న ఆరోపణలపై ఇప్పటికే అంతర్గత విచారణ నడుస్తోంది. కాగా, ఇది వ్యవస్థాగతమైన భద్రతా వైఫల్యంగా అర్థమవుతోంది.
News March 18, 2026
మూసీ ప్రక్షాళన: ఇళ్లు కూల్చకండి.. మురికిని వదలకండి!

ఏళ్లు గడుస్తున్నా మూసీలో మురుగు కంపు తగ్గలేదు కానీ, ప్రచార ఆర్భాటం మాత్రం పెరిగిపోయింది. గత 12 ఏళ్లలో నిధుల కేటాయింపులు కాగితాలకే పరిమితమయ్యాయని హైదరాబాద్ సిటిజన్ ఫోరం గళమెత్తింది. సుందరీకరణ పేరుతో వేలాది ఇళ్లను కూల్చడం సరికాదని, బఫర్ జోన్ సాకుతో పేదలను రోడ్డున పడేయొద్దని డిమాండ్ చేస్తోంది. అభివృద్ధి అంటే ఇళ్లు కూల్చడం కాదు, నదిని శుద్ధి చేయడం అని ఫోరం స్పష్టం చేసింది.


