News April 4, 2024

తిరుపతి జిల్లా సిద్ధమా..?: జగన్

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతోంది. నిన్న పూతలపట్టులో సభ అనంతరం ఆయన తిరుపతి జిల్లాలోకి ప్రవేశించారు. ఇవాళ తిరుపతి జిల్లాలో డ్రైవర్లతో సమావేశం అవుతారు. అలాగే రోడ్ షోతో పాటు నాయుడుపేటలో బహిరంగ సభ జరగనుంది. ఈక్రమంలో సీఎం జగన్ ‘Day-8 తిరుపతి జిల్లా సిద్ధమా…?’ అని ట్వీట్ చేశారు.

Similar News

News October 2, 2025

చిత్తూరు జిల్లాకు స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర అవార్డ్స్

image

చిత్తూరు జిల్లాకు స్వర్ణాంధ్ర-2025 అవార్డులు దక్కాయి. రాష్ట్రస్థాయిలో ఆరు అవార్డులు, జిల్లా స్థాయిలో 48 అవార్డులు దక్కాయి. ఈనెల ఆరో తేదీన మంత్రి మండిపల్లి అవార్డుల ప్రదానం చేయనున్నారు పరిశుభ్రత రంగంలో విశిష్ట సేవలకు ఈ అవార్డులు దక్కాయి. ఈ మేరకు వివరాలను కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. ఈ విజయాలు స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఆయన వెల్లడించారు.

News October 2, 2025

చిత్తూరు: ఈ నియోజకవర్గాల్లో ఇప్పటికీ పెద్దిరెడ్డిదే హవా?

image

గతంలో సీమను తన కనుసన్నల్లో శాసించిన పెద్దిరెడ్డి హవానే ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో సాగుతోందట. పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లి, జీడీ నెల్లూరు, పీలేరు, పలమనేరులో బాహాటంగానే పెద్దిరెడ్డి అనుచరులు టీడీపీలో చేరి ఆయనకు సహకరిస్తున్నారట. గత ప్రభుత్వం హయాంలో పెత్తనం చెలాయించిన నేతలు ఇప్పుడు టీడీపీ కండువా కప్పుకుని గ్రావెల్, ఇసుక దందా, అక్రమం మైనింగులకు పాల్పడుతున్నట్లు తెలుగుతమ్ముళ్లు ఆరోపిస్తున్నారు.

News October 2, 2025

చిత్తూరు: ఎనిమిది KGBVల్లో సీసీ కెమెరాలు

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న కేజీబీవీల్లో బాలికల భద్రత నిమిత్తం సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా సమగ్రశిక్షా శాఖ ఏపీసీ వెంకటరమణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని 8 కేజీబీవీలకు సీసీ కెమెరాలను మంజూరు చేసిందన్నారు. వీటిల్లో ప్రత్యేక బృందం సీసీ కెమెరాలను అమర్చుతారన్నారు.