News September 11, 2025
నానో యూరియా వాడకమే లాభదాయకం: పెద్దపల్లి వ్యవసాయ శాఖ

ఈ వానాకాలంలో గతేడాదితో పోలిస్తే అదనంగా 1,551 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగమైంది. ఇకపై వరి 2, 3వ దఫాలకు నానో యూరియానే వాడాలని పెద్దపల్లి వ్యవసాయ శాఖ రైతులకు సూచించింది. యూరియా బస్తాలు ఎక్కువ వృథా అవుతాయని, నానో యూరియా మాత్రం మెల్లగా పోషకాలు అందించి ఎకరాకు 5-7 బస్తాల అదనపు దిగుబడులు ఇస్తుందని పేర్కొంది. ఒక్క బాటిల్ ధర రూ.150 మాత్రమేనని, రైతులు అపోహలు విడిచి వినియోగించాలని విజ్ఞప్తి చేసింది.
Similar News
News April 3, 2026
TU: ప్రేరణ-2026.. రాష్ట్ర స్థాయికి 50 మంది ఎంపిక

తెలంగాణ కామర్స్ అసోసియేషన్ (TCA)&టీయూ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రేరణ-2026 ఇంటర్ కాలేజియేట్ కామర్స్ ఫెస్ట్’లో భాగంగా తెలంగాణ యూనివర్సిటీ స్థాయి పోటీలు నిర్వహించారు. 200 మందికిపైగా విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను కనబరచగా 50 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి మాట్లాడుతూ.. పోటీలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయన్నారు.
News April 3, 2026
₹167కోట్లు!.. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్

రాజా రవివర్మ పెయింటింగ్స్లో ఒకటైన ‘యశోద-కృష్ణ’ వేలంలో ఏకంగా ₹167.20కోట్లు పలికింది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండీ సైరస్ పూనావాలా దీనిని దక్కించుకున్నారు. ఎంఎఫ్ హుసేన్ ‘గ్రామ్ యాత్ర’ పెయింటింగ్ రికార్డ్ను (₹118Cr) బ్రేక్ చేసి దేశంలోనే ఖరీదైన చిత్రంగా నిలిచింది. ఈ ఆయిల్ పెయింటింగ్ను రవివర్మ 1890ల్లో గీశారు. యశోద ఆవు పాలు పితుకుతుంటే బాలకృష్ణుడు పాత్రతో చేయిచాస్తున్నట్టుగా ఈ చిత్రం ఉంది.
News April 3, 2026
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ

సైబర్ నేరాల పట్ల విశ్రాంత ఉద్యోగులు, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట సైబర్ క్రైమ్ డీఎస్పీ జి. శ్రీనివాస్ సూచించారు. సైబర్ జాగ్రూక్త దివాస్ సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ ఫర్ సీనియర్ సిటిజన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు, సిద్దిపేట ప్రజలు పాల్గొన్నారు.


