News September 11, 2025
కరీంనగర్: తల్లికి 3 నెలల డబ్బులు చెల్లించాలని ఆదేశం

శంకరపట్నం మండలం మొలంగూర్ వాసి మరాఠీ రాజమ్మ తన కుమారుడు పట్టించుకోవడంలేదని డిసెంబర్ 2024లో ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో నెలకు రూ.6 వేలు డబ్బులు చెల్లించాలని ఆదేశించారు. గురువారం డీవీసీ కౌన్సిలర్ పద్మావతి, DHEW కవిత విచారణలో 3 నెలలుగా డబ్బులు ఇవ్వడం లేదని రాజమ్మ తెలపగా తల్లి ఖాతాలో వెంటనే డబ్బులు జమ చేయాలని కుమారుడిని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సమ్మయ్య, పోలీసులు ఉన్నారు.
Similar News
News September 12, 2025
SBIలో 122 ఉద్యోగాలు

SBI 122 పోస్టుల భర్తీకి <
News September 12, 2025
నస్రుల్లాబాద్: వ్యభిచార గృహంపై దాడి.. ముగ్గురి అరెస్ట్

నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని పోచమ్మ కాలనీలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో ఎస్సై రాఘవేంద్ర, తన సిబ్బందితో కలిసి వ్యభిచార గృహంపై దాడి చేసి వారి వద్ద నుంచి 3 మొబైల్స్, రూ.500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు SI వెల్లడించారు. కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
News September 12, 2025
ADB: కూలిన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం సాయంత్రం కూలిన పురాతన భవనాన్ని ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరిశీలించారు. తహసిల్దార్ శ్రీనివాస్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలగలేదని వారు తెలిపారు. నూతన కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని వారు చెప్పారు.