News September 11, 2025
NRPT: వరద నష్టంపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

నిరంతరం కురుస్తున్న వర్షాలకు జిల్లాలో రోడ్లు, భవనాలు, కల్వర్టలు, స్కూల్ భవనలు, వసతి గృహాలు, తాగునీటి సరఫరా పైప్ లైన్లకు ఏమైనా నష్టం కలిగితే తాత్కాలిక మరమ్మతులకు సంబందించిన ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. వరద నష్టంపై గురువారం సాయంత్రం నారాయణపేట కలెక్టరేట్లోని తన ఛాంబర్ అధికారులతో సమీక్ష చేశారు. మండలాల వారిగా నివేదికలు తయారు చేయాలన్నారు.
Similar News
News March 21, 2026
వనపర్తి: అగ్నివీర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం!

భారత సైన్యంలో 2027 సంవత్సరానికి గానూ ‘అగ్నివీర్’ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభమైనట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 1వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గరిష్ఠ వయోపరిమితిని 21 నుంచి 22 ఏళ్లకు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.
దరఖాస్తుకు వెబ్సైట్:
www.joinindianarmy.nic.in
News March 21, 2026
నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్

నిర్మల్, ఖానాపూర్, బైంసా మూడు మున్సిపాలిటీలలో ఆస్తీ పన్నుల వసూలుకు జిల్లాలో మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా వార్డ్ ఆఫీసర్లు ఇంటింటా తిరుగుతూ పన్నులను వసూలు చేస్తున్నారు. మార్చి 31 నాటితో గడువు తేదీ ముగియనుండగా ఈ నెల 1 నుంచి ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. మరో 11 రోజులు గడువు మాత్రమే ఉంది. 100% లక్ష్యాన్ని అధికారులు నెరవేరుస్తారా చూడాలి.
News March 21, 2026
రాష్ట్రాలకు అదనంగా 20% కమర్షియల్ గ్యాస్

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్రం శుభవార్త చెప్పింది. రాష్ట్రాలకు అదనంగా మరో 20% కమర్షియల్ గ్యాస్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈనెల 23 నుంచి ఇది అమలులోకి రానుంది. ఇటీవల కేంద్రం అనౌన్స్ చేసిన 10% గ్యాస్కు ఇది అదనం. హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలకు గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది.


