News September 12, 2025
జగిత్యాల: ఈనెల 20న క్రీడా పోటీలు

జగిత్యాల యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని మినీ స్టేడియంలో ఈనెల 20న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా క్రీడాకారులకు పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి తెలిపారు. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలతోపాటు ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు నిమ్మకాయ చెంచా, మ్యూజికల్ ఛైర్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 11, 2026
ASF: మోసాలతో రూ.2.07 కోట్లు నష్టం.. రూ.17.81 లక్షలు రికవరీ

ASF జిల్లాలో సైబర్ నేరాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 2024లో జిల్లాలో 21 సైబర్ కేసులు నమోదయ్యాయి. గతేడాది 315 ఫిర్యాదులు అందగా, వాటిలో 37 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. సైబర్ మోసాలతో ప్రజలు రూ.2.07 కోట్లు నష్టపోగా, రూ.17.81 లక్షలు మాత్రమే రికవరీ చేశారు. ఈ కేసులకు సంబంధించి 20 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ మోసాలకు గురైతే 1930 వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
News March 11, 2026
60 ఏళ్లలో 100 రెట్లు పెరిగిన సిలిండర్ ధర!

దేశంలో డొమెస్టిక్ LPG సిలిండర్ ధరలు 60 ఏళ్లలో భారీగా పెరిగాయి. 1960లో కేవలం ₹7 నుంచి ₹10 మధ్య ఉన్న ధర 2026 నాటికి ఢిల్లీలో ₹913కు చేరుకుంది. 1990లో ₹120, 2010లో ₹400గా ఉన్న ధర నేడు సామాన్యుడిపై పెను భారంగా మారింది. అంతర్జాతీయ ఇంధన ధరల మార్పులు, మారుతున్న సబ్సిడీ విధానాలు & ద్రవ్యోల్బణం కారణంగానే ఈ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన ఆరు దశాబ్దాలలో సిలిండర్ ధర దాదాపు వంద రెట్లు పెరగడం గమనార్హం.
News March 11, 2026
KMR: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. జాగ్రత్తలు పాటించాలి

కామారెడ్డి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో బాన్సువాడ మండలం కొల్లూరులో అత్యధికంగా 37.7°C ఉష్ణోగ్రత నమోదైంది. మద్నూర్, బీర్కూర్, బిచ్కుంద మండలాల్లో కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.


