News September 12, 2025
కరీంనగర్: శ్మశానవాటికలో కరవైన వసతులు.. ఆగ్రహించిన గ్రామస్థులు

శంకరపట్నం మండలం కన్నాపూర్ గ్రామంలో 3 నెలల చిన్నారి అనారోగ్యంతో మృతిచెందింది. చిన్నారి మృతి చెందడంతో దహన సంస్కారాలు చేయడానికి వెళ్తుంటే వర్షం మొదలై రాత్రి అయింది. శ్మశానవాటికలో విద్యుద్దీపాలు లేకపోవడంతో అంధకారం ఏర్పడింది. గ్రామస్థులు, అంత్యక్రియలకు వచ్చిన కుటుంబ సభ్యులు తమ సెల్ ఫోన్ టార్చ్ లైట్లతో దహన సంస్కారాలు నిర్వహించారు. కనీస వసతులు లేకపోవడంతో అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News September 12, 2025
దసరాకు ‘ఆదిత్య 999’ సినిమా ప్రకటన?

క్రిష్ జాగర్లమూడి, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో ‘ఆదిత్య 999’ సినిమా తెరకెక్కనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై దసరా పండుగ రోజున అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మూవీకి బాలయ్యే స్టోరీ అందించినట్లు సమాచారం. గతంలో క్రిష్-బాలయ్య కాంబోలో గౌతమీపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ కథా నాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.
News September 12, 2025
AP న్యూస్ రౌండప్

✶ శ్రీశైలం ప్రాజెక్టు, తుంగభద్ర, కాటన్ బ్యారేజ్, గోరకల్లు జలాశయం మరమ్మతులకు రూ.455Cr మంజూరు చేసిన ప్రభుత్వం.. వచ్చే వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేస్తామన్న మంత్రి నిమ్మల
✶ డిగ్రీ ప్రవేశాల గడువు 13వ తేదీ వరకు పొడిగింపు
✶ ఈ నెల 15, 16 తేదీల్లో జిల్లా కలెక్టర్ల సదస్సు
✶ ఈడిగ, గౌడ (గమల్ల), కలలీ, గౌండ్ల, శెట్టిబలిజ, శ్రీశయన (సెగిడి) కులాల ముందు గౌడ్ అనే పదాన్ని తొలగిస్తూ ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వం
News September 12, 2025
నేడు వైస్ ప్రెసిడెంట్గా రాధాకృష్ణన్ ప్రమాణం

భారత 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఇవాళ ఉ.10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో పీఎం నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, NDA కీలక నేతలు, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు పాల్గొననున్నారు. ఈ ప్రోగ్రామ్ కోసం ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.