News September 12, 2025
VKB-కృష్ణ రైల్వేలైన్ పనులు చేపట్టాలి: CM

వికారాబాద్ – కృష్ణ రైల్వే లైన్ పనులను త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గురువారం పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులపై దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. కొత్తగా నిర్మించే వికారాబాద్ – కృష్ణ రైల్వే ప్రాజెక్ట్ ద్వారా కొడంగల్, నారాయణపేట, మక్తల్, పరిగి ప్రాంతాల ప్రజలకు మేలు జరగనుంది.
Similar News
News March 11, 2026
భద్రాచలం: మావోయిస్టులు.. పోలీసులకు మధ్య కాల్పులు

ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పార్థాపూర్ ప్రాంతంలో బుధవారం భద్రతా బలగాలు, మావోయిస్ట్ల మధ్య భీకర ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్ట్లు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఎన్కౌంటర్ జరిగిన విషయాన్ని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నిఖిల్ రఖేచా ధ్రువీకరించారు. ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సమచారం.
News March 11, 2026
గద్వాల: పోలీసుల సంక్షేమమే లక్ష్యం.. ఎస్పీ ‘దర్బార్’

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం ఏఆర్ పోలీసులతో ‘పోలీస్ దర్బార్’ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందితో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను పోలీసులు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. సిబ్బంది సంక్షేమానికి తమ ప్రభుత్వం, శాఖ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ హామీ ఇచ్చారు.
News March 11, 2026
ఆ మందులతో లివర్ డ్యామేజీ: అధ్యయనం

ఆయుర్వేదం, ఇతర ప్రత్యామ్నాయ మందుల వాడకంపై తాజా అధ్యయనం షాకింగ్ విషయాలను వెల్లడించింది. 386 రకాల ఉత్పత్తులను పరీక్షించగా 27.7% మందుల్లో స్టెరాయిడ్స్, 31.3% ఉత్పత్తుల్లో జంతు సంబంధిత వ్యర్థాలు ఉన్నట్లు ఇందులో తేలినట్లు ‘ఫ్రాంటియర్స్ ఇన్ గ్యాస్ట్రోఎంటరాలజీ’ ప్రచురించింది. వీటిలో సీసం, ఆర్సెనిక్ వంటి భార లోహాలు మోతాదుకు మించి ఉన్నాయని, వీటివల్ల 39% మందిలో కాలేయం పాడై మరణ ముప్పు పెరుగుతుందని తెలిపింది.


