News September 12, 2025
జనగామ: భూ భారతి దరఖాస్తులను వేగవంతం చేయాలి: కలెక్టర్

భూ భారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన భూ భారతి, సాదా బైనామ, జాతీయ కుటుంబ లబ్ధి పథకం, సీఎం ప్రజావాణి దరఖాస్తులపై సమీక్షించారు. ఎమ్మార్వోల సందేహాలను నివృత్తి చేస్తూ, వేగవంతమైన పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News September 12, 2025
చీరాల: ‘హత్య చేశానంటూ లొంగిపోయాడు’

చీరాలలోని హారిస్ పేటకు చెందిన పేర్లి కోటేశ్వరరావు మృతి మిస్టరీ వీడింది. ఈ నెల 3న కోటేశ్వరరావు తన ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. అనివార్య కారణాలవల్ల తానే కోటేశ్వరరావును హత్య చేశానంటూ నిందితుడు విజయ్ బాబు చీరాల టూ టౌన్ CI నాగభూషణం, SI వెంకటేశ్వర్లు ఎదుట గురువారం లొంగిపోయాడు. దీంతో చట్ట ప్రకారం విజయ్ బాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు వివరించారు.
News September 12, 2025
ఓబులవారిపల్లి: జ్వరంతో చిన్నారి మృతి

ఓబులవారిపల్లి (M) వై. కోటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల చందన జ్వరంతో బాధపడుతూ వాంతులు చేసుకుంది. కోడూరుకు తరలిస్తుండగా చిన్నారికి ఫిట్స్ వచ్చాయి. కోడూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు, పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలించాలని సూచించారు. తిరుపతికి తీసుకెళ్తుండగా చిన్నారి మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.
News September 12, 2025
HYD: BRO ట్రాఫిక్ ఉల్లంఘిస్తే మెసేజ్ చేయండి

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘన జరిగితే ఒక్క వాట్సాప్ మెసేజ్ చేస్తే చాలని పోలీసులు తెలిపారు. హెల్మెట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ వంటి వాటిపై సైతం ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్నారు. ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘన జరిగినా.. 9490617346కు వాట్సప్ ద్వారా లొకేషన్, డిటైల్స్ ఎంటర్ చేసి, ఫొటోతో పంపాలన్నారు. ఓ వ్యక్తి ఇటీవల హెల్మెట్ ధరించకపోవడంపై అధికారులు స్పందించారు.