News September 12, 2025

ఒక తప్పిదం క్షణాల్లో జీవితాన్ని నాశనం చేస్తుంది: SP

image

కామారెడ్డి టౌన్ PS పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన ఒక వ్యక్తికి కోర్టు ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ. వెయ్యి జరిమానా విధించింది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా, జిల్లా వ్యాప్తంగా మొత్తం 61 మందిపై కేసులు నమోదు చేసి, వారికి కోర్టు మొత్తం రూ.56 వేల జరిమానా విధించింది. SP రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. ఒక చిన్న తప్పిదం కూడా క్షణాల్లో ఒకరి జీవితాన్ని నాశనం చేస్తుందని పేర్కొన్నారు.

Similar News

News September 12, 2025

డయేరియాతో ఎవరూ మరణించలేదు: మంత్రి సత్యకుమార్

image

AP: విజయవాడలో ఇప్పటివరకు 141 డయేరియా కేసులు నమోదైనట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ వ్యాధితో నగరంలో ఎవరూ మరణించలేదని ఆయన చెప్పారు. న్యూరాజేశ్వరిపేటలోని డయేరియా బాధితులను మంత్రి నారాయణ, MP చిన్నితో కలిసి ఆయన పరామర్శించారు. ‘ఇంటింటి సర్వే చేసి ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. బుడమేరు ప్రాంతంలోని భూగర్భజలాలు కలుషితం అయ్యాయేమోనన్న అనుమానం ఉంది’ అని వ్యాఖ్యానించారు.

News September 12, 2025

రెడ్‌లైట్ థెరపీ గురించి తెలుసా?

image

రెడ్‌లైట్ థెరపీ శరీర సౌందర్యం పెంచే ఓ వైద్య పద్ధతి. గాయాలు మానడానికి, చర్మంపై ముడతలు, మచ్చలు, గీతలు తొలగించడానికి ఈ చికిత్సను ఉపయోగిస్తారు. వృద్ధాప్యంతో వచ్చే చర్మ సంబంధిత సమస్యలనూ ఈ థెరపీ ద్వారా నయం చేస్తారు. ఈ థెరపీ కొత్త చర్మకణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. దీన్ని మొటిమలు, చర్మ క్యాన్సర్ చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. ఇది చర్మంలో కొల్లాజెన్‌ను పెంచుతుంది. దీంతో చర్మంపై ముడతలు తగ్గుతాయి.

News September 12, 2025

తాండూరు: సంగెంకలాన్ వాగులో గల్లంతు.. శవమై లభ్యం

image

తాండూరు మండలం సంగెంకలాన్ వాగులో కొట్టుకుపోయిన మొగులప్ప మృతదేహం లభ్యమైంది. వరద ఉద్ధృతి తగ్గడంతో శుక్రవారం ఉదయం గ్రామస్థులు గాలింపు చేపట్టగా, సంగెంకలాన్-చెట్టినాడ్ సిమెంట్ కర్మాగారం మార్గంలో ఓ చెట్టుకు చిక్కుకుని ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం గ్రామస్థులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని వెలికితీశారు.