News April 4, 2024

48గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బు: చౌహాన్

image

TG: యాసంగిలో పండే ప్రతి ధాన్యం గింజనూ కొంటామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ DS చౌహాన్ స్పష్టం చేశారు. ‘ధాన్యం విక్రయించిన రైతుల అకౌంట్లో 48గంటల్లోనే డబ్బు జమ చేస్తాం. పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా, ఇక్కడి బియ్యం అక్రమంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. ఫిర్యాదులు చేసేందుకు 1967తో పాటు 1800 4250 0333 టోల్‌ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంటాయి’ అని వెల్లడించారు.

Similar News

News October 8, 2024

ఫలవంతంగా ప్రధాని మోదీతో చర్చలు: CBN

image

ప్రధాని మోదీతో ఢిల్లీలో చర్చలు ఫలవంతంగా సాగినట్లు ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వ్యయ అంచనాలకు క్యాబినెట్ ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలిపినట్లు పేర్కొన్నారు. రాజధాని అమరావతికి మోదీ మద్దతు అభినందనీయమని కొనియాడారు. మరోవైపు డిసెంబర్‌లో విశాఖలో కొత్త రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేసే అవకాశముందన్నారు. ఏపీలో రైల్వే శాఖ రూ.73,743 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు.

News October 8, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: అక్టోబర్ 8, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 4:56 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:08 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:04 గంటలకు
అసర్: సాయంత్రం 4:21 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:59 గంటలకు
ఇష: రాత్రి 7.11 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 8, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.