News September 12, 2025
కాకినాడ మత్స్యకారులు విడుదల

AP: కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులను శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసింది. గూగుల్ నావిగేషన్ తప్పుగా చూపించడంతో ఈ నలుగురు ఆగస్టు 4న శ్రీలంక జలాల్లోకి వెళ్లిపోయారు. దీంతో శ్రీలంక కోస్ట్ గార్డ్ వీరిని అదుపులోకి తీసుకుంది. భారత ప్రభుత్వం విజ్ఞప్తితో ఈ నలుగురిని విడుదల చేసింది. దీంతో జాలర్లు మరో 2 రోజుల్లో సముద్రమార్గం ద్వారా కాకినాడకు చేరుకోనున్నారు.
Similar News
News September 12, 2025
ఆర్థిక సమస్యలున్నా అందరికీ ప్రయోజనం: అనగాని

AP: రాష్ట్రంలో ఆర్థిక సమస్యలున్నా తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. ‘జీఎస్టీ వసూళ్లు, వృద్ధి రేటులో రాష్ట్రం మంచి ప్రగతి సాధించింది. రూ.10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి’ అని ఆయన పేర్కొన్నారు.
News September 12, 2025
కొంతకాలం సోషల్ మీడియాకు దూరం: అనుష్క

సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉండనున్నట్లు టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి వెల్లడించారు. ‘నేను కొంత కాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి అనుకుంటున్నా. స్క్రోలింగ్ను పక్కన పెట్టి ప్రపంచంతో తిరిగి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే మనందరి వాస్తవ ప్రపంచం అదే. అతి త్వరలో మీతో మరిన్ని స్టోరీలు పంచుకుంటా. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తుంటా’ అని పోస్ట్ చేశారు. అనుష్క నటించిన ‘ఘాటీ’ ఇటీవలే విడుదలైంది.
News September 12, 2025
47 ఉద్యోగాలు.. నేరుగా ఇంటర్వ్యూతో ఎంపిక

రాంచీలోని MECON లిమిటెడ్లో 47 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ విభాగాల్లో అడిషనల్ ఇంజినీర్, Dy.ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులున్నాయి. ఉద్యోగానుభంతోపాటు విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 15, 16, 19, 20వ తేదీల్లో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అప్లికేషన్ ఫామ్, ఇతర పూర్తి వివరాల కోసం <