News September 12, 2025
చిత్తూరు: 24 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్

చిత్తూరు నగరంలో పేకాట ఆడుతున్న 24 మందిని అరెస్టు చేసినట్లు గురువారం టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య తెలిపారు. వారి వద్ద నుంచి 6 పేకాట కార్డు ప్యాకెట్లను, రూ.37,160 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పేకాట, గంజాయి, స్మగ్లింగ్, ఎర్రచందనం, మద్యం విక్రయాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామన్నారు.
Similar News
News September 12, 2025
నదీ ప్రవాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వుకాలు నిషేధం: కలెక్టర్

జిల్లాలో ఎక్కడైనా నదీ ప్రవాహక ప్రాంతాలలో ఇసుక తవ్వకాలు నిషేధమని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో ఆయన ఎస్పీ మణికంఠ చందోలు, జేసీలతో కలిసి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఆదాయం కోసం కాకుండా ప్రజలకు సులభంగా ఇసుక అందుబాటులో ఉంచడం ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. జిల్లాలో 45,850 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉందన్నట్లు ఆయన వివరించారు.
News September 12, 2025
చిత్తూరు జిల్లాలోని ఈ మండలాల్లో రేపు పవర్ కట్

జిల్లాలోని వివిధ మండలాలలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు EE మునిచంద్ర పేర్కొన్నారు. మరమ్మతుల నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చిత్తూరు అర్బన్, రూరల్, గుడిపాల, యాదమరి, ఐరాల, తవణంపల్లి, బంగారుపాళ్యం, పూతలపట్టు మండలాలలో సరఫరా ఉండదన్నారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
News September 11, 2025
ద్రావిడ వర్సిటీలో పీహెచ్డీ అడ్మిషన్లకు దరఖాస్తులు

ద్రావిడ వర్సిటీలో వివిధ విభాగాల్లో పీహెచ్డీ అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కిరణ్ కుమార్ తెలిపారు. మొత్తం 14 శాఖలో 62 అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోపు దరఖాస్తులను వర్సిటీలో సమర్పించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్సైట్ సందర్శించాలని కోరారు.