News April 4, 2024
కూటమిలో విశాఖ లోక్సభ సీటు లొల్లి

AP: విశాఖ లోక్సభ స్థానంలో పోటీపై కూటమి నేతల మధ్య ఇంకా సఖ్యత రానట్లు తెలుస్తోంది. ఈ సీటును బీజేపీ తీసుకోవాలని, జీవీఎల్ నరసింహారావును అభ్యర్థిగా ప్రకటించాలని కమలం నేతలు ఢిల్లీలో పంచాయితీ పెట్టారు. ఈ మేరకు నిన్న జేపీ నడ్డాకు కూడా లేఖ రాసిన నేతలు.. విశాఖ సీటుపై రాష్ట్ర నాయకత్వం గట్టిగా పట్టుబట్టలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా ఈ స్థానంలో టీడీపీ భరత్కు టికెట్ ఇచ్చింది.
Similar News
News January 12, 2026
2026లో యుగాంతం.. నిజమెంత?

కొత్త ఏడాది ప్రారంభమైన ప్రతిసారీ ‘యుగాంతం’ థియరీలు ముందుకొస్తుంటాయి. బాబా వాంగ వంటి వారిని పేర్కొంటూ ఊహాగానాలు పుట్టుకొస్తాయి. AI ప్రాముఖ్యత, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి దానికి సంకేతాలంటూ SMలో స్టోరీలు ఇప్పుడు వైరలవుతున్నాయి. ఏలియన్స్ భూమిని ఆక్రమిస్తారనే చర్చా జరుగుతుంది. వీటిలో ఏమాత్రం నిజం ఉండదని చరిత్ర చెబుతోంది. కేవలం SM ఆల్గారిథమ్ వల్లే ఇవి ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి.
News January 12, 2026
RVNLలో ఇంజినీర్ పోస్టులు

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(<
News January 12, 2026
ఎంగేజ్మెంట్ చేసుకున్న శిఖర్ ధవన్

భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ప్రేయసి సోఫీతో నిశ్చితార్థం జరిగిన విషయాన్ని ఆయన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఈ మేరకు చేతికి రింగ్ ఉన్న ఫొటోను ఆయన షేర్ చేశారు. అంతకుముందు ఆస్ట్రేలియాకు చెందిన ఆయేషాను 2012లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2023లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.


