News September 12, 2025

మదనపల్లె: ఇళ్లల్లో చోరీలకు పాల్పడే దొంగకు రెండేళ్ల జైలు

image

ఇళ్లల్లో చోరీలకు పాల్పడే దొంగకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ మదనపల్లె రెండవ అదనపు జ్యుడీసియల్ కోర్టు జడ్జి గురువారం తీర్పు ఇచ్చినట్లు టూ టౌన్ సీఐ రాజారెడ్డి తెలిపారు. మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో రెండు ఇళ్లల్లో దొంగతనం చేసిన కేసులో చీకిలగుట్టలో ఉండే కావడి సోమశేఖర్‌ను అప్పటి పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణ జరిగి, నేరం రుజువుకావడంతో శిక్ష పడింది.

Similar News

News September 12, 2025

ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్‌మెంట్‌ను ప్రోత్సహించాం: బుగ్గన

image

AP: రాబోయే పదేళ్లను దృష్టిలో పెట్టుకొని తమ హయాంలో ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్‌మెంట్‌ను ప్రోత్సహించామని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. విజయవాడలో జరుగుతున్న Way2News కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు. ఇప్పటి ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు లేకుండా అప్పులు చేస్తోందని ఆరోపించారు. 2019-24 మధ్య YCP రూ.3లక్షల కోట్లు అప్పు చేస్తే కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే రూ.లక్షన్నర కోట్ల అప్పు చేసిందన్నారు.

News September 12, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లా.. వర్షపాతమిలా

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న ఉ.8.30 గంటల నుంచి ఇవాళ ఉ.6 గంటల వరకు పలుచోట్ల వర్షాలు కురిశాయి. తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో అత్యధికంగా 35.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు శుక్రవారం తెలిపారు. ముస్తాబాద్‌ 30.5 మిల్లీమీటర్లు, ఎల్లారెడ్డిపేటలో 29.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గంభీరావుపేట 26.3, ఇల్లంతకుంటలో 19.8 మిల్లీమీటర్ల వర్షం పడగా, కొన్ని మండలాల్లో మాత్రం తేలికపాటి వర్షాపాతం నమోదైంది.

News September 12, 2025

JNTUH: బీటెక్ సెకెండ్ సెమిస్టర్ రిజల్ట్స్

image

బీటెక్ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలను వర్సిటీ అధికారులు రిలీజ్ చేశారు. ఈ ఫలితాల్లో విద్యార్థులు తక్కువ శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. కేవలం 42.38 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలు వర్సిటీ వెబ్ సైట్‌లో ఉన్నాయని ఎగ్జామినేషన్ డైరెక్టర్ క్రిష్ణమోహన్ రావు తెలిపారు.