News September 12, 2025

పాడేరు: ‘మధ్యాహ్నం 3:30 గంటల వరకే ఈ సేవలు’

image

పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో ఇవాళ ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం జరగనుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు.

Similar News

News September 12, 2025

విజయదశమి ఉత్సవాలపై కలెక్టర్ సమీక్ష

image

విజయదశమి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, గొడవలకు తావులేకుండా పండుగ జరపడంపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు చేశారు.

News September 12, 2025

వనపర్తి: జిల్లాలో నేటి వర్షపాత వివరాలు

image

వనపర్తి జిల్లాలో 15 వర్షపాతం నమోదు కేంద్రాలలో శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా రేవల్లిలో 133.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింద. గోపాల్‌పేట 101.0 మి.మీ, పెద్దమందడి 98.0 మి.మీ, గణపూర్ 97.0 మి.మీ, వనపర్తి 74.0 మి.మీ, ఏదుల, పెబ్బేరులో 65.0 మి.మీ, పానగల్ 61.0 మి.మీ, కొత్తకోట 53.0 మి.మీ, మదనాపురం 43.0 మి.మీ, వీపనగండ్ల 38.0 మి.మీ, చిన్నంబావి 34.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News September 12, 2025

తెనాలి: ఆయేషా మీరా తల్లిదండ్రులకు CBI నోటీసులు

image

ఆయేషా మీరా హత్య కేసులో ఆమె తల్లిదండ్రులకు సీబీఐ నోటీసులు పంపింది. ఈ నెల 19న విజయవాడ సీబీఐ కోర్టులో హాజరు కావాల్సిందిగా నోటీసులలో పేర్కొంది. దీనిపై ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ భాష ఆవేదన వ్యక్తం చేస్తూ నోటీసులను తిరస్కరించారు. 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని, బాధితులైన తమను ఎన్నిసార్లు కోర్టుకు తిప్పుతారని తల్లి శంషాద్ బేగం వాపోయారు.