News September 12, 2025

ఓబులవారిపల్లి: జ్వరంతో చిన్నారి మృతి

image

ఓబులవారిపల్లి (M) వై. కోటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల చందన జ్వరంతో బాధపడుతూ వాంతులు చేసుకుంది. కోడూరుకు తరలిస్తుండగా చిన్నారికి ఫిట్స్ వచ్చాయి. కోడూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు, పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలించాలని సూచించారు. తిరుపతికి తీసుకెళ్తుండగా చిన్నారి మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

Similar News

News September 12, 2025

వనపర్తి: జిల్లాలో నేటి వర్షపాత వివరాలు

image

వనపర్తి జిల్లాలో 15 వర్షపాతం నమోదు కేంద్రాలలో శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా రేవల్లిలో 133.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింద. గోపాల్‌పేట 101.0 మి.మీ, పెద్దమందడి 98.0 మి.మీ, గణపూర్ 97.0 మి.మీ, వనపర్తి 74.0 మి.మీ, ఏదుల, పెబ్బేరులో 65.0 మి.మీ, పానగల్ 61.0 మి.మీ, కొత్తకోట 53.0 మి.మీ, మదనాపురం 43.0 మి.మీ, వీపనగండ్ల 38.0 మి.మీ, చిన్నంబావి 34.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News September 12, 2025

తెనాలి: ఆయేషా మీరా తల్లిదండ్రులకు CBI నోటీసులు

image

ఆయేషా మీరా హత్య కేసులో ఆమె తల్లిదండ్రులకు సీబీఐ నోటీసులు పంపింది. ఈ నెల 19న విజయవాడ సీబీఐ కోర్టులో హాజరు కావాల్సిందిగా నోటీసులలో పేర్కొంది. దీనిపై ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ భాష ఆవేదన వ్యక్తం చేస్తూ నోటీసులను తిరస్కరించారు. 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని, బాధితులైన తమను ఎన్నిసార్లు కోర్టుకు తిప్పుతారని తల్లి శంషాద్ బేగం వాపోయారు.

News September 12, 2025

మెడికల్ కాలేజీల టెండర్లపై జగన్ వార్నింగ్.. సజ్జల ఏమన్నారంటే?

image

AP: మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయకూడదనే ఉద్దేశంతోనే జగన్ మెడికల్ కాలేజీల టెండర్లపై హెచ్చరికలు జారీ చేశారని YCP సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘కోర్ సెక్టార్స్‌లో ప్రభుత్వ ప్రాధాన్యం ఉండాలనేదే మా లక్ష్యం. ప్రభుత్వ సంస్థను ప్రైవేటుపరం చేస్తుంటే కచ్చితంగా హెచ్చరిస్తాం’ అని అన్నారు. ఇక తమ మద్దతుదారులపై అక్రమ కేసులు పెడుతున్నందుకే కొందరు పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.