News September 12, 2025
చీరాల: ‘హత్య చేశానంటూ లొంగిపోయాడు’

చీరాలలోని హారిస్ పేటకు చెందిన పేర్లి కోటేశ్వరరావు మృతి మిస్టరీ వీడింది. ఈ నెల 3న కోటేశ్వరరావు తన ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. అనివార్య కారణాలవల్ల తానే కోటేశ్వరరావును హత్య చేశానంటూ నిందితుడు విజయ్ బాబు చీరాల టూ టౌన్ CI నాగభూషణం, SI వెంకటేశ్వర్లు ఎదుట గురువారం లొంగిపోయాడు. దీంతో చట్ట ప్రకారం విజయ్ బాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు వివరించారు.
Similar News
News March 18, 2026
భారత్కు రెండు షిప్పుల్లో LPG.. ఒక్క రోజుకే సరిపోతుందన్న చిదంబరం!

శివాలిక్, నందాదేవి షిప్పుల్లో భారత్కు చేరుకున్న ఎల్పీజీ ఒకటిన్నర రోజులకు మాత్రమే సరిపోతుందని కాంగ్రెస్ ఎంపీ పి.చిదంబరం ట్వీట్ చేశారు. ‘మార్చి 14-17 మధ్య శివాలిక్, నందాదేవి షిప్పులు హార్ముజ్ జలసంధిని క్రాస్ చేసి భారత్కు చేరాయి. ఈ 2 షిప్పులు కలిసి 92,700 మెట్రిక్ టన్నుల LPG తీసుకొచ్చాయి. గూగుల్ సమాచారం ప్రకారం దేశంలో ఉన్న ప్రస్తుత డిమాండ్కి ఇది 1.25 లేదా 1.6 రోజులకు సరిపోతుంది’ అని పేర్కొన్నారు.
News March 18, 2026
సిద్దిపేట: ఘోర ప్రమాదం.. ఇద్దరు బాలురు మృతి

మిరుదొడ్డిలో <<19418573>>రోడ్డు <<>>ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదానికి గురైన ముగ్గురు బాలురిలో చెన్నయ్ నితిన్ను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మరో బాలుడు పిట్ల రామ్ చరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. మరో బాలుడు సాన హర్షవర్ధన్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడి చికిత్స పొందుతున్నాడు.
News March 18, 2026
పుదుచ్చేరిలో ఎన్నికలు.. ‘జిల్లాలో మూడు చోట్ల చెక్ పోస్టులు’

పుదుచ్చేరి, యానాం ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ షామ్మోహన్ తెలిపారు. ఈనెల 18 నుంచి ఏప్రిల్ 9 వరకు నీలపల్లి, మల్లవరం, సుంకరపాలెం వద్ద 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు రొటేషన్ పద్ధతిలో రెవెన్యూ, ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ అధికారులు ఇక్కడ విధులు నిర్వహిస్తారు. అక్రమ మద్యం, నగదు, ఓటర్లకు పంచే సామాగ్రి తరలిస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.


