News September 12, 2025
ఆత్మకూరు- వనపర్తి రాకపోకలు బంద్

ఆత్మకూరు-వనపర్తి మధ్య రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పోలీసులు తెలిపారు. మదనాపురం దగ్గర ఉన్న ఊకచెట్టు వాగు కాజువేపై వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి వనపర్తి, కొత్తకోటకు వెళ్లడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని చెప్పారు.
Similar News
News September 12, 2025
ఎన్ హెచ్-16 డీపీఆర్పై అనకాపల్లి ఎంపీ సమీక్ష

అనకాపల్లి-అన్నవరం-దివాన్ చెరువు ఎన్ హెచ్-16 విస్తరణకు సంబంధించి డీపీఆర్ తయారీకి అనకాపల్లి కలెక్టరేట్ లో శుక్రవారం కలెక్టర్,జేసీ అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల , పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్లతో ఎంపీ సీఎం రమేష్ సమీక్ష నిర్వహించారు. ఈ రహదారిని ఆరు లైన్లకు విస్తరించనున్నారు. దీనిపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో చర్చించారు.ఎన్.హెచ్.ఏ.ఐ. ప్రాజెక్ట్ డైరెక్టర్ రోహిత్ కుమార్ పాల్గొన్నారు.
News September 12, 2025
KGH అభివృద్ధిపై విభాగాధిపతులతో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సమీక్ష

KGH అభివృద్ధిపై కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్ని విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. వైద్య పరికరాలు, సిబ్బంది అవసరాలు, వసతులపై చర్చించారు. ఆంకాలజీకి 30 మంది స్టాఫ్ నర్సులు, గ్యాస్ట్రో విభాగానికి పరికరాలు, ఎండోక్రనాలజీకి మరమ్మతులు ప్రతిపాదించారు. వార్డుల వారీగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు.
News September 12, 2025
HYD: ఈ మెట్రో రైలు మాకొద్దు బాబోయ్: L&T

HYDలో లక్షలాది మంది ప్రయాణికులను చేరవేస్తున్న మెట్రో రైల్ నిర్వహణ తమకు చేతకావడం లేదని.. ఖర్చులు పెరిగిపోతున్నాయని L&T కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దాదాపు రూ.5వేల కోట్లు బకాయిలు రావాల్సి ఉందని.. రోజూ వచ్చే టికెట్ ఆదాయం సరిపోవడం లేదని.. ఇలా అయితే ఉద్యోగుల జీతాలు ఇచ్చుకోలేమని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వానికి గానీ, రాష్ట్ర ప్రభుత్వానికి గానీ అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.