News September 12, 2025

జగదేవ్పూర్: భర్తపై ప్రియుడితో కలిసి దాడి.. ఇద్దరి అరెస్ట్

image

అక్రమ సంబంధం కారణంగా ఓ మహిళ కట్టుకున్న భర్తనే కడతేర్చాలనుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జగదేవ్పూర్ మండలం ఇటిక్యాలకు చెందిన ఓ వ్యక్తితో మమతకు వివాహమైంది. అనంతరం ఆదే గ్రామానికి చెందిన వడ్డే బాబుతో వివాహేతర బంధం ఏర్పడింది. వారికి భర్త అడ్డు వస్తున్నాడనే నెపంతో ప్రియుడితో కలిసి భర్తపై దాడి చేయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాబు, మమతను గురువారం అరెస్ట్ చేశారు.

Similar News

News March 11, 2026

బాలికకు అండగా తిరుపతి కలెక్టర్, ఎస్పీ

image

ఓబులవారిపల్లి మండలం పెద్ద ఊరంపాడుకు చెందిన గిరిజన బాలిక పూజ(10) తప్పిపోయిన ఘటనలో పోలీసులు వేగంగా స్పందించారు. గంటల్లోనే గుర్తించి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. అనంతరం కలెక్టర్ డా.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించారు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఇద్దరికి రూ.50 వేల చొప్పున రూ.లక్ష ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రకటించారు. గురుకుల పాఠశాలలో ఉచిత విద్య, వసతి కల్పించాలని ఆదేశించారు.

News March 11, 2026

విశాఖ: కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన విశాఖలో మంగళవారం సాయంత్రం జరిగింది. గోస్తాని గేటు ప్రధాన రహదారి పక్కన హై వోల్టేజ్ స్తంభం ఎక్కిన వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు హార్బర్ పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి హై వోల్టేజ్ స్తంభం ఎక్కుతుండగా నేవీ సిబ్బంది గమనించి దిగిపోమని హెచ్చరించినప్పటికీ మరింత మీదకు వెళ్లడంతో వైర్లు తగిలి ప్రమాదానికి గురైనట్లు చెప్పారు.

News March 11, 2026

నల్గొండ: అప్పు విషయంలో గొడవ ప్రాణం తీసింది

image

అప్పు విషయంలో జరిగిన గొడవ ఒకరి ప్రాణాలు తీసింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో ఆంజనేయులు, శంభు లింగం మధ్య అప్పు విషయంలో ఘర్షణ తలెత్తింది. శంభు లింగంకు తీవ్రగాయాలు కావడంతో ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శంభు లింగం మరణించాడు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.