News September 12, 2025

సంగారెడ్డి: 15న జిల్లా స్థాయి సైన్స్ సెమినార్

image

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోనీ సైన్స్ సెంటర్లో ఈనెల 15న జిల్లా స్థాయి సైన్స్ సెమినార్ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సెమినార్‌కు 8 నుంచి 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. క్వాంటమ్ యుగం ప్రారంభం, సంభావ్యతలు, సవాళ్లు అనే అంశంపైన సెమినార్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Similar News

News September 12, 2025

అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్‌గా నిశాంత్ కుమార్

image

అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్‌గా నిశాంత్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుత కలెక్టర్ చామకూరి శ్రీధర్‌ను బదిలీ చేశారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ ఏపీ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా పనిచేశారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా శ్రీధర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిల్లాను అభివృద్ధి పథంలో నడపడానికి తన వంతు కృషి చేశారు. అయితే ఈయనను ఎక్కడికి బదిలీ చేశారో తెలియాల్సి ఉంది.

News September 12, 2025

సికింద్రాబాద్: గాంధీలో సేవలు ఇకనైనా గాడిన పడేనా?

image

గాంధీ ఆస్పత్రి అంటేనే తెలుగు రాష్ట్రాల్లోని పేదలకు ఓ ధైర్యం.. అలాంటిది ఇటీవల ఇందులో సరైన సేవలందడం లేదని పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనంతటికీ కారణం సూపరింటెండెంట్ డా.రాజకుమారి నిర్లక్ష్య వైఖరే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన ప్రభుత్వం ఆమె స్థానంలో అడిషనల్ DME డా.వాణి నూతన సూపరింటెండెంట్‌ను నియమించింది. ఇప్పుడైనా సేవలు మెరుగుపడతాయేమోనని నగర వాసులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

News September 12, 2025

నిర్మల్ : బీజేపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

image

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మె రాజు తెలిపారు. ఇందులో భాగంగా 17న మండల, పట్టణ కేంద్రాల్లో రక్తదానం, 18న స్వచ్ఛభారత్, 25న ప్రవాస్ బూత్ స్థాయిలో మొక్కలు నాటడం, 27న దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ, సన్మానం ఉంటుందన్నారు. పార్టీ శ్రేణులు, పదాధికారులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు.