News September 12, 2025
మావోయిస్టు మృతితో మడికొండలో విషాద ఛాయలు..!

హనుమకొండ జిల్లా మడికొండలో మావోయిస్టు మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి. మడికొండ వాస్తవ్యుడైన కేంద్ర కమిటీ సభ్యుడు (CCM), సెంట్రల్ రీజినల్ బ్యూరో మెంబర్ (CRBM), ఒడిషా రాష్ట్ర కమిటీ కార్యదర్శి మోడెం బాలకృష్ణ(60) అలియాస్ బాలన్న అలియాస్ భాస్కర్ అలియాస్ మనోజ్ అలియాస్ రాజేష్ అలియాస్ రామచందర్ అలియాస్ రాజేంద్ర మరణించినట్టుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా వెల్లడించారు.
Similar News
News September 12, 2025
ఈవీఎం గోడౌన్ను తనిఖీ చేసిన కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం తనిఖీ చేశారు.
కలెక్టర్ గోడౌన్లోని సీల్ను, లోపల ఉన్న ఈవీఎంలు, వీవీ ప్యాట్లను పరిశీలించారు. ఫైర్ అలారం, అగ్నిమాపక యంత్రాలు, స్లాబ్, డ్రైనేజీ వ్యవస్థను పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. సీసీ కెమెరాల పనితీరు, సెక్యూరిటీ అప్రమత్తతపై ఆయన స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఎన్నికల సామగ్రిని భద్రంగా ఉంచాలని ఆదేశించారు.
News September 12, 2025
అభివృద్ధి కోసమే PPP మోడల్స్: CM చంద్రబాబు

AP: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన అవసరముందని CM చంద్రబాబు Way2News Conclaveలో పేర్కొన్నారు. ‘అభివృద్ధి కోసమే PPP మోడల్స్ అనుసరిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఇవే అమలవుతున్నాయి. దీంతో సంపద సృష్టి జరుగుతుంది. ప్రభుత్వానికి ఆదాయం పెరిగి పథకాలు అమలు చేసే శక్తి వస్తుంది. అందుకే గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవాళ్లం. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాం’ అని తెలిపారు.
News September 12, 2025
ట్రెండింగ్లో #Way2NewsConclave2025

ఇండియాలో తొలిసారిగా ఓ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ కాన్క్లేవ్ ఏర్పాటు చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. విజయవాడ కాన్క్లేవ్ గురించి చర్చిస్తూ పలువురు Xలో పోస్టులు పెడుతున్నారు. దీంతో Xలో #Way2NewsConclave2025 ట్రెండ్ అవుతోంది. వచ్చే దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే కార్యాచరణను సీఎం చంద్రబాబు వే2న్యూస్ కాన్క్లేవ్లో వివరిస్తున్నారు.<<17688514>> లైవ్ను<<>> మీరూ వీక్షించండి.