News September 12, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. HYD బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10gmల పసిడి ధర రూ.771 పెరిగి రూ.1,11,280కు చేరింది. గత 8 రోజుల్లో రూ.4,421 పెరిగింది. ఇక 22 క్యారెట్ల 10 gmల గోల్డ్ రూ.700 ఎగబాకి రూ.1,02,000 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.2000 పెరిగి రూ.1,42,000గా ఉంది. వారం రోజుల్లో కేజీ సిల్వర్పై రూ.6వేలు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Similar News
News March 7, 2026
నెలకు ₹2,500.. ఫ్రీ బస్ జర్నీ: మహిళలకు TVK చీఫ్ వరాలు

తమిళనాడు ఎన్నికల దృష్ట్యా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు TVK చీఫ్ విజయ్ కీలక హామీలు ప్రకటించారు. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. లేడీస్ కోసం ప్రత్యేకంగా పోలీస్ విభాగం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పేదలకు ఏటా ఫ్రీగా 6 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని తెలిపారు. పాఠశాల చిన్నారులకు ఏడాదికి ₹15 వేల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. మహిళలకు నెలకు ₹2,500 ఇస్తామని హామీ ఇచ్చారు.
News March 7, 2026
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రసక్తే లేదు: ప్రభుత్వ వర్గాలు

దేశంలో ఇంధన నిల్వలు మెరుగుపడుతున్నాయని, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రసక్తే లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేందుకు ఇతర మార్గాల ద్వారా క్రూడాయిల్ ఇంపోర్ట్స్ను 60% నుంచి 70%కి పెంచినట్లు తెలిపాయి. అలాగే ముప్పులేని పొరుగు దేశాలపై దాడులు చేయబోమని ఇరాన్ హామీ ఇవ్వడంతో హార్ముజ్ మార్గంలో రవాణా త్వరలోనే సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని వెల్లడించాయి.
News March 7, 2026
REWIND: INS ఖుక్రీ.. 194 మంది వీరమరణం

ఇటీవల US దాడిలో ఇరాన్ నౌక ‘<<19299071>>దేనా<<>>’ మునిగిపోవడంతో 1971 నాటి INS ఖుక్రీ త్యాగం గుర్తుకొస్తోంది. నాటి యుద్ధంలో పాక్ జలాంతర్గామి ‘హంగోర్’ ప్రయోగించిన టార్పెడో నుంచి INS కిర్పాన్ తప్పించుకుంది. వెంటనే హంగోర్ను అడ్డుకునేందుకు ఖుక్రీ కదిలింది. అయితే అది వదిలిన రెండో టార్పెడో నేరుగా ఆయిల్ ట్యాంకులకు తగలడంతో భారీ పేలుడు సంభవించింది. కేవలం 2 నిమిషాల్లోనే నౌక సముద్రంలో మునిగి 194 మంది వీరమరణం పొందారు.


