News September 12, 2025

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ వాణి

image

గాంధీ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్‌గా అడిషనల్ డీఎంఈ డాక్టర్ వాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు సూపరింటెండెంట్‌గా పనిచేసిన డాక్టర్ రాజకుమారిని ఫిజియాలజీ ప్రొఫెసర్‌గా బదిలీ చేశారు. ఆసుపత్రి సిబ్బంది నుంచి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

Similar News

News September 12, 2025

రింగ్ రైల్‌‌తో మారనున్న HYD రూపురేఖలు

image

సిటీలో ఇపుడు ఔటర్ రింగ్ రోడ్ 158 కిలో మీటర్లు.. ఆ తర్వాత రూ.362 రీజినల్ రింగ్ రోడ్.. దీని చుట్టూ రింగ్ రైల్ ప్రతిపాదనలు.. ఇవి అన్నీ పూర్తైతే నగర స్వరూపమే మారిపోతుంది. కొత్త కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు, కాలేజీలు, మాల్స్ ఇలా ఎన్నెన్నో వస్తాయి. ఇదే జరిగితే దేశం మొత్తం సిటీవైపే చూస్తుంది. HYD అలా తయారుకావాలని మనమూ కోరుకుందాం. మీరేమంటారు?

News September 12, 2025

HYD: LIC ఉద్యోగికి నరకం చూపిస్తున్న సైబర్ నేరగాళ్లు

image

HYDలో ఓ LIC ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు నరకం చూపించారు. బ్యాంక్ డిటైల్స్ ఇవ్వాలంటూ ఫోన్‌లో ఒత్తిడి చేశారు. అడల్ట్ వీడియోలు వైరల్ చేసినందుకు నీపై కేసులు నమోదయ్యాయని బెదిరించారు. అడిగిన వివరాలు ఇవ్వకపోతే మధ్యాహ్నం లోగా అరెస్ట్ చేస్తామని బెదిరరించారు. పోలీసులమంటూ LIC ఉద్యోగితో వీడియో కాల్‌లోనూ సైబర్ నేరగాళ్లు మాట్లాడారు. 4 రోజులుగా సైబర్ నేరగాళ్ల వేధింపులతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు వాపోయారు.

News September 12, 2025

హైదరాబాద్: ఇది కదా.. రాజకీయం అంటే!

image

మీరు పార్టీ మారారు అని BRS కోర్టు మెట్లెక్కితే.. మేమెక్కడ మారాం.. కేవలం అభివృద్ధి పనుల కోసమే CMను కలిశాం అని ఆ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. శేరిలింగంపల్లి MLA గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తాము పార్టీ మారలేదని స్పీకర్‌కు సమాధానమిచ్చారు. అంటే.. నాయకులకు పార్టీ కంటే పదవే ముఖ్యమని, పదవి ఉంటుందంటే ఏ పార్టీలో అయినా ఉంటారనే కదా దీనర్థం. ఇదికదా రాజకీయం అంటే అని ప్రజలు చర్చించుకుంటున్నారు.