News September 12, 2025

HYD: నేడే Ed.CET సెకండ్ ఫేజ్ రిజల్ట్స్

image

Ed.CET 2025 సెకండ్ ఫేజ్ పరీక్ష ఫలితాలు నేడు వెలువడనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. నేడు సాయంత్రం వరకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సీటు పొందిన కాలేజీల వారిగా ఫలితాలు విడుదల చేస్తామని, విద్యార్థులందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు.

Similar News

News March 13, 2026

పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలు: ఎస్పీ

image

మెదక్ జిల్లాలో పదో తరగతి పరీక్షల కోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జిల్లాలోని అన్ని కేంద్రాల వద్ద 163 BNSS అమలులో ఉంటుందని వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు.

News March 13, 2026

చెరువుల పరిరక్షణే లక్ష్యం: HNK కలెక్టర్

image

జిల్లాలోని చెరువులు, కుంటలను కాపాడుకోవడం మనందరి బాధ్యతని HNK కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. జల వనరుల్లో సిల్ట్ పేరుకుపోవడం, కాలుష్య కారకాలు చేరడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చెరువుల నీటి నాణ్యతను కాపాడుతూ, జీవవైవిధ్యానికి భంగం కలగకుండా పక్కా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

News March 13, 2026

పదో తరగతి పరీక్షలు.. గిరిజన విద్యార్థులు 3,628 మంది

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఐటీడీఏ పరిధిలోని గిరిజన విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమయ్యారని పీవో రాహుల్ తెలిపారు. 92 విద్యాసంస్థల నుంచి 3,628 మంది విద్యార్థులు రేపటి నుంచి పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. 56 ఆశ్రమ పాఠశాలలు, 21 వసతిగృహాలు, 12 గురుకులాలు, 3 బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉన్నారన్నారు. మొత్తం బాలురు 1,689 కాగా, బాలికలు 1,939 మంది హాజరవుతున్నట్లు వివరించారు.