News September 12, 2025
ఆ పెట్టుబడి చిట్కాలు నమ్మొద్దు: వరంగల్ సైబర్ పోలీసులు

వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే పెట్టుబడి సలహాలు నమ్మి మోసపోవద్దని వరంగల్ సైబర్ పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. అవి పెట్టుబడి చిట్కాలు కావని, సైబర్ వలలని గుర్తించాలని సూచించారు. కొద్ది రోజుల్లో డబ్బులు రెట్టింపు అవుతాయన్న అత్యాశతో మోసపోవద్దని, సులభంగా డబ్బు సంపాదించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. పెట్టుబడుల విషయంలో ఆలోచించి, ఆచితూచి అడుగు వేయాలని సూచించారు.
Similar News
News March 24, 2026
HYD: అందుకే మీకు నిద్ర పట్టనిది!

నగరవాసుల వర్క్ కల్చర్, అర్ధరాత్రి వరకు ఫోన్ వినియోగం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఉప్పల్కు చెందిన డా.రంజిత్ కుమార్ తెలిపారు. స్క్రీన్ టైమ్ పెరగడంతో నిద్రలేమి సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నాయని స్లీపింగ్ పాటర్న్పై నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. రోజుకు 5 గం.కుపైగా స్క్రీన్ టైమ్ ఉన్నవారు నిద్ర సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కొందరిలో నిద్ర నాణ్యత తగ్గుతోందని వివరించారు.
News March 24, 2026
HYD: అందుకే మీకు నిద్ర పట్టనిది!

నగరవాసుల వర్క్ కల్చర్, అర్ధరాత్రి వరకు ఫోన్ వినియోగం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఉప్పల్కు చెందిన డా.రంజిత్ కుమార్ తెలిపారు. స్క్రీన్ టైమ్ పెరగడంతో నిద్రలేమి సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నాయని స్లీపింగ్ పాటర్న్పై నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. రోజుకు 5 గం.కుపైగా స్క్రీన్ టైమ్ ఉన్నవారు నిద్ర సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కొందరిలో నిద్ర నాణ్యత తగ్గుతోందని వివరించారు.
News March 24, 2026
ADB: గంజాయి సాగుపై ఉక్కుపాదం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 3 నెలలుగా గంజాయి సాగు, రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 17 కేసులు నమోదు చేసి, 34 మంది నిందితులను అరెస్ట్ చేశారు. రూ.69.20 లక్షల విలువైన 560 గంజాయి మొక్కలు, ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా నార్నూర్, ఇచ్చోడ ప్రాంతాల్లో అంతర పంటగా సాగు చేస్తున్నట్లు గుర్తించారు. గంజాయి సాగు చేస్తే పథకాలు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు.


