News September 12, 2025
కూకట్పల్లిలో రేపు జాబ్ మేళా

ఐటీ, డీపీఓ ఉద్యోగాలకు సంబంధించి రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి కిషన్ తెలిపారు. కూకట్పల్లి ప్రభుత్వ కళాశాలలో ఈ మేళా ఉంటుందన్నారు. ఇంటర్ మీడియట్లో 75 శాతం ఉత్తీర్ణత సాధించిన వారు ఈ మేళాకు హాజరు కావొచ్చన్నారు. అభ్యర్థులు ఫొటోలు, సర్టిఫికెట్లు తమ వెంట కచ్చితంగా తీసుకురావాలన్నారు. వివరాలకు 76740 07616, 79818 34205 నంబర్లను సంప్రదించాలన్నారు.
Similar News
News September 12, 2025
రింగ్ రైల్తో మారనున్న HYD రూపురేఖలు

సిటీలో ఇపుడు ఔటర్ రింగ్ రోడ్ 158 కిలో మీటర్లు.. ఆ తర్వాత రూ.362 రీజినల్ రింగ్ రోడ్.. దీని చుట్టూ రింగ్ రైల్ ప్రతిపాదనలు.. ఇవి అన్నీ పూర్తైతే నగర స్వరూపమే మారిపోతుంది. కొత్త కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు, కాలేజీలు, మాల్స్ ఇలా ఎన్నెన్నో వస్తాయి. ఇదే జరిగితే దేశం మొత్తం సిటీవైపే చూస్తుంది. HYD అలా తయారుకావాలని మనమూ కోరుకుందాం. మీరేమంటారు?
News September 12, 2025
HYD: LIC ఉద్యోగికి నరకం చూపిస్తున్న సైబర్ నేరగాళ్లు

HYDలో ఓ LIC ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు నరకం చూపించారు. బ్యాంక్ డిటైల్స్ ఇవ్వాలంటూ ఫోన్లో ఒత్తిడి చేశారు. అడల్ట్ వీడియోలు వైరల్ చేసినందుకు నీపై కేసులు నమోదయ్యాయని బెదిరించారు. అడిగిన వివరాలు ఇవ్వకపోతే మధ్యాహ్నం లోగా అరెస్ట్ చేస్తామని బెదిరరించారు. పోలీసులమంటూ LIC ఉద్యోగితో వీడియో కాల్లోనూ సైబర్ నేరగాళ్లు మాట్లాడారు. 4 రోజులుగా సైబర్ నేరగాళ్ల వేధింపులతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు వాపోయారు.
News September 12, 2025
హైదరాబాద్: ఇది కదా.. రాజకీయం అంటే!

మీరు పార్టీ మారారు అని BRS కోర్టు మెట్లెక్కితే.. మేమెక్కడ మారాం.. కేవలం అభివృద్ధి పనుల కోసమే CMను కలిశాం అని ఆ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. శేరిలింగంపల్లి MLA గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తాము పార్టీ మారలేదని స్పీకర్కు సమాధానమిచ్చారు. అంటే.. నాయకులకు పార్టీ కంటే పదవే ముఖ్యమని, పదవి ఉంటుందంటే ఏ పార్టీలో అయినా ఉంటారనే కదా దీనర్థం. ఇదికదా రాజకీయం అంటే అని ప్రజలు చర్చించుకుంటున్నారు.