News September 12, 2025

కంది: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి రూ.1119 కోట్ల రక్షణ శాఖ ఆర్డర్

image

మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి రూ.1119 కోట్ల రక్షణ శాఖ ఆర్డర్ రావడం చాలా ఆనందంగా ఉందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. విలువైన ఆర్డర్ రావడం కోసం సహాయం చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్, AVNL బృందానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి మైలు సాధించడంలో మెదక్ ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తను చివరి వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటానన్నారు.

Similar News

News September 12, 2025

రాజకీయాన్ని తిరస్కరించడం పరిష్కారం కాదు: జయప్రకాశ్ నారాయణ

image

AP: రాజకీయాన్ని తిట్టడం మనల్ని మనం అవమానించుకోవడమే అని వే2న్యూస్ కాన్‌క్లేవ్‌లో జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నారు. ‘నిజాయితీ గల, దాపరికాలులేని చర్చ ఎంతో అవసరం. అలాంటి వేదికను ఏర్పాటు చేసిన వే2న్యూస్‌కు అభినందనలు. రాజకీయ నాయకులపై బురద చల్లడం, తిట్టడం చేస్తాం. కానీ కనిపిస్తే వంగి దండాలు పెడతాం. అతి వినయం, అవమానించడం అవసరం లేదు. రాజకీయాన్ని తిరస్కరించడం పరిష్కారం కాదు’ అని తెలిపారు.

News September 12, 2025

రాష్ట్రంలో 4,687 పోస్టులకు గ్రీన్ సిగ్నల్

image

AP: రాష్ట్రంలో ఉన్న 4,687 మినీ అంగన్వాడీ కార్యకర్తలకు ఇటీవల పదోన్నతి కల్పించిన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో కొత్తగా 4,687 హెల్పర్ల నియామకానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో నియామక విధివిధానాలు వెలువడనున్నాయి. కాగా ప్రస్తుతం ₹7,000 వేతనం అందుకుంటున్న కార్యకర్తలు ప్రమోషన్ల తర్వాత ₹11,500 అందుకోనున్నారు.

News September 12, 2025

రేపు పాఠశాలలకు సెలవు లేదు: డీఈఓ

image

గత నెల 18న వర్షాల కారణంగా ప్రకటించిన సెలవుకు బదులుగా ఈ నెల 13వ తేదీన (రెండో శనివారం) పాఠశాలలు తెరిచి ఉంటాయని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశించినట్లు డీఈఓ రమేశ్ తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు యథావిధిగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఈఓలకు, ఎంఈఓలకు ఆదేశాలు పంపించినట్లు ఆయన పేర్కొన్నారు.