News September 12, 2025

గణపవరం: రోడ్డు ప్రమాదంలో వీఆర్‌వో మృతి

image

రోడ్డు ప్రమాదంలో గణపవరం మండలం ఎస్. కొండేపాడు వీఆర్‌వో అడబాల కనక దుర్గా ప్రసాద్ (50) మృతి చెందారు. పిప్పర వద్ద శుక్రవారం బైక్ పై వెళ్తున్న దుర్గా ప్రసాద్‌ను లారీ ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే ఆయన మృతి చెందారు. గణపవరం ఎస్ఐ ఆకుల మణికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడు వీఆర్‌వో స్వస్థలం వీరేశ్వరపురం గ్రామం.

Similar News

News March 20, 2026

సిరిసిల్ల: 4 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది

image

యాసంగి సీజన్‌లో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో యాసంగి సీజన్ కొనుగోళ్లపై అధికారులు,రైస్ మిల్లర్లు,ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సుమారు జిల్లాలో 2,70,000 నుంచి 3 లక్షల మెట్రిక్ నెల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొత్తం 240 కొనుగోలు కేంద్రాలు ఉంటాయన్నారు.

News March 20, 2026

రూ.5.62 లక్షల కోట్లకు చేరువగా రుణభారం!

image

తెలంగాణలో అప్పులు గణనీయంగా పెరుగుతున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంపై రుణభారం రూ.5.62 లక్షల కోట్లకు చేరుకుంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2025-26లో రుణభారం రూ.5.03 లక్షల కోట్లు కాగా ఇప్పుడు అదనంగా మరో రూ.59,000 కోట్లు పెరగనుంది. రుణభారం ఈ విధంగా పెరగడం వల్ల, ఈ ఏడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు సేకరించే విషయంలో ప్రభుత్వానికి ఆటంకాలు తప్పేలా లేవు.

News March 20, 2026

ఆయిల్ పామ్ సాగుతో రైతు ఆదాయం రెట్టింపు: రాఘవరెడ్డి

image

ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి తెలిపారు. వరి, పత్తి, మిర్చి పొలాల్లో కూడా దీనిని సాగు చేయవచ్చని, రవాణా ఖర్చులను ప్రభుత్వమే భరించి మూడు రోజుల్లోనే నగదు జమ చేస్తుందని వెల్లడించారు. రైతు మహోత్సవంలో భాగంగా ఉత్తమ సాగుదారులుగా నిలిచిన రైతులను ఆయన సత్కరించారు. ఆధునిక సాగు పరికరాలపై అవగాహన పెంచుకోవాలని రైతులకు సూచించారు.