News September 12, 2025

పెద్దపల్లి: రైల్వే ప్రయాణికులకు తిరుపతి వీక్లీ ట్రైన్

image

చర్లపల్లి- రక్సాల్ మధ్య రైలు నం.07051/52 రాకపోకలు సాగిస్తుంది. రైలు నం.07051 ఈనెల 20న తిరుపతి నుంచి ప్రారంభమై ప్రతి శనివారం వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, PDPL, మంచిర్యాలలో స్టాప్లలో ఆగుతూ వెళ్లనుంది. రైలు నం.07052 ఈనెల 23న ప్రారంభమై ప్రతి మంగళవారం రక్సాల్ నుంచి తిరుపతికి రాకపోకలు సాగిస్తుందని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. పండగల దృష్ట్యా దీనిని వినియోగించుకోవాలన్నారు.

Similar News

News September 12, 2025

HYD: ORR పరిధిలో 39 STPలు

image

HYD ORR పరిధి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో ప్రభుత్వం అమృత్- 2.0 పథకంలో భాగంగా రూ.3,849.10 కోట్లతో మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణానికి పరిపాలనా అనుమతి ఇచ్చిందని జలమండలి పేర్కొంది. ప్యాకేజీ- 2 కింద మొత్తం 39 మురుగు శుద్ధి కేంద్రాలను నిర్మించనున్నారు. మొత్తం సామర్థ్యం 972MLD కాగా.. వ్యయం రూ.3,849.10 కోట్లు కానున్నట్టుగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.

News September 12, 2025

HYD: ఈ ప్రాంతాల్లో STP కేంద్రాల నిర్మాణం

image

ORR పరిధిలో 39 మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం జరగనుంది. STP కేంద్రాల లిస్టును జలమండలి విడుదల చేసింది. అమీన్‌పూర్, తెల్లాపూర్, ఐక్రిసాట్, ఉష్కేబావి, బాచుగూడ, తిమక్క చెరువు, గాంధీ గూడెం, పీర్జాదిగూడ, నాగారం, నార్సింగి (ORR), సాంగం (బాపూఘాట్), హైదర్షాకోట, ఫతేనగర్, చిట్రాపురి కాలనీ, HYD పబ్లిక్ స్కూల్, మీర్పేట్, మసాబ్‌చెరువు, కాప్రా, రవిర్యాల్, బొంగులూరు వంటి ప్రాంతాల్లో నిర్మిస్తామన్నారు.

News September 12, 2025

నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

image

క‌లెక్ట‌ర్ డా. జి. ల‌క్ష్మీశా శుక్ర‌వారం రాత్రి విజయవాడ న్యూ రాజ‌రాజేశ్వ‌రిపేట‌, పరిస‌ర ప్రాంతాల్లోని 11 వార్డు స‌చివాల‌యాల ప్ర‌త్యేక అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ప్ర‌తిరోజూ ఇంటింటి ఫీవ‌ర్‌ స‌ర్వే నిర్వ‌హ‌ణ‌, డయేరియా బారిన‌ప‌డ‌కుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం త‌దిత‌రాల‌పై సూచ‌న‌లు చేశారు. ప్ర‌త్యేక క‌ర‌ప‌త్రాలు పంపిణీ చేసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.