News September 12, 2025
పాడేరు: 12 నుంచి హాట్ ఎయిర్ బెలూన్ అందుబాటులోకి

పర్యాటకులకు హాట్ ఎయిర్ బెలూన్ అందుబాటులోకి తీసుకువస్తున్నామని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీ పూజ పేర్కొన్నారు. శుక్రవారం పీవో ఛాంబర్లో హాట్ ఎయిర్ బెలూన్ డిజిటల్ పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. మెగా ఈగల్ ఫ్లై సంస్థ ఆధ్వర్యంలో 12 నుంచి పర్యాటకులకు పద్మాపురం గార్డెన్లో దీన్ని అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. ఇందులో పర్యాటకులు విహరించవచ్చని అన్నారు.
Similar News
News September 12, 2025
పునర్విభజన చట్టం: HYD- అమరావతికి రైల్వే లైన్

భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. GM సంజయ్కుమార్ శ్రీవాస్తవ ప్రకటించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం హైదరాబాద్ నుంచి అమరావతికి ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును కేంద్రం అమలు చేయాల్సి ఉందని సైతం చెప్పారు.
News September 12, 2025
HYDలో డ్రోన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

HYDలో డ్రోన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ (DGQA) ప్రకటించింది. మిలిటరీ డ్రోన్ డెవలప్మెంట్ కోసం ఇదొక వేదిక కానుంది అని పేర్కొన్నారు. అంతేకాక, UAV, డ్రోన్ సామర్థ్యాలను పెంచే దిశగా అడుగులు పడనున్నట్లు తెలిపారు. ఈ కీలక అడుగు డ్రోన్ టెక్నాలజీని మరో స్థాయికి తీసుకెళ్తుందని ఆశాభవం వ్యక్తం చేశారు.
News September 12, 2025
ADB: ‘ఎన్నికల హామీ ప్రకారం వేతనాలు చెల్లించాలి’

మధ్యాహ్న భోజన పథకం బిల్లుల నిర్వహణను యుకుబేర్ నుంచి మినహాయించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల చిన్నన్న అన్నారు. శుక్రవారం ఆయన ఆదిలాబాద్ సీఐటీయూ ఆఫీస్లో మాట్లాడారు. కార్మికుల పెండింగ్ బిల్లులతోపాటు వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం కార్మికులకు పదివేల వేతనం అమలు చేయాలని పేర్కొన్నారు.