News September 12, 2025

స్టీల్ ప్లాంట్‌ను కాపాడేందుకు ఏమైనా చేస్తాం: బొత్స

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు తాము దేనికైనా సిద్ధమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణ పూర్తిగా నిలిచిపోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నారు. 32 విభాగాలను ఔట్‌సోర్సింగ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. రాష్ట్రంలో అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఉద్ధరిస్తున్నట్లు చూపుతున్నారు’ అని బొత్స మండిపడ్డారు.

Similar News

News September 12, 2025

రాజకీయాల్లోకి వెళ్లను: బ్రహ్మానందం

image

తనకు రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదని కమెడియన్ బ్రహ్మానందం అన్నారు. ఆయన ఆత్మకథ ‘నేను మీ బ్రహ్మానందం’ పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలో ఆవిష్కరించారు. బ్రహ్మానందం 30ఏళ్ల సినీ ప్రస్థానంలో వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారని వెంకయ్య కొనియాడారు. తన జీవితం గురించి ఈ బుక్‌లో రాశానని బ్రహ్మానందం తెలిపారు. పేద కుటుంబం నుంచి వచ్చానని, లెక్చరర్‌గా పనిచేశానని చెప్పారు.

News September 12, 2025

వాహనదారులకు అలర్ట్.. ఇకపై ఇవి తప్పనిసరి

image

TG: రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నైట్ టైమ్ విజిబిలిటీ కోసం ఇకపై వాహనాలకు రిఫ్లెక్టివ్ టేప్స్, రియర్ మార్కింగ్ ప్లేట్స్ తప్పనిసరి చేసింది. 2&3 వీలర్స్, బస్సులు, ట్రాక్టర్లు, ట్రెయిలర్లు, కన్‌స్ట్రక్షన్, గూడ్స్ తదితర అన్ని రకాల వెహికల్స్ కచ్చితంగా వీటిని అమర్చుకోవాలని ఆదేశించింది. రోడ్ సేఫ్టీపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

News September 12, 2025

నేపాల్ తాత్కాలిక పీఎంగా సుశీల

image

నేపాల్ తాత్కాలిక పీఎంగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీ ఎంపికయ్యారు. కాసేపట్లో ఆమె నేపాల్ తొలి మహిళా PMగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుశీల పేరును Gen-z యువత ప్రతిపాదించగా ప్రెసిడెంట్ రామచంద్ర పౌడెల్ ఆమోదించారు. నిన్నటి నుంచి ఆర్మీ సమక్షంలో నిరసనకారులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. అనంతరం పార్లమెంట్‌‌ను రద్దు చేశారు. కాగా సుశీలకు భారత్‌‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె మన దేశంలో విద్యనభ్యసించారు.