News September 12, 2025

తెనాలి: ఆయేషా మీరా తల్లిదండ్రులకు CBI నోటీసులు

image

ఆయేషా మీరా హత్య కేసులో ఆమె తల్లిదండ్రులకు సీబీఐ నోటీసులు పంపింది. ఈ నెల 19న విజయవాడ సీబీఐ కోర్టులో హాజరు కావాల్సిందిగా నోటీసులలో పేర్కొంది. దీనిపై ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ భాష ఆవేదన వ్యక్తం చేస్తూ నోటీసులను తిరస్కరించారు. 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని, బాధితులైన తమను ఎన్నిసార్లు కోర్టుకు తిప్పుతారని తల్లి శంషాద్ బేగం వాపోయారు.

Similar News

News March 23, 2026

వంటగ్యాస్‌పై ఆందోళన అవసరం లేదు: మంత్రి పార్థసారథి

image

రాష్ట్రంలో వంటగ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. సీఎంతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సరఫరా అంతరాయం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇండక్షన్ స్టవ్స్, పైప్ గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. పంటనష్టం అంచనాలు 26లోగా పూర్తి చేసి 31లోగా నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు.

News March 23, 2026

GNT: నీటి దినోత్సవ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

ప్రపంచ నీటి దినోత్సవం పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జల వనరుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. భావితరాలకు శుద్ధ జలాలను అందించడం, కాలుష్యం లేని పర్యావరణం, మంచి వాతావరణం అందించడం అవసరం అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ MD నజీనా బేగం తదితరులు పాల్గొన్నారు.

News March 23, 2026

GNT: నీటి దినోత్సవ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

ప్రపంచ నీటి దినోత్సవం పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఎస్.ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జల వనరుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. భావితరాలకు శుద్ధ జలాలను అందించడం, కాలుష్యం లేని పర్యావరణం, మంచి వాతావరణం అందించడం అవసరం అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ MD నజీనా బేగం తదితరులు పాల్గొన్నారు.