News September 12, 2025
HYD: మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసే ఛాన్స్!

నగర వ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు ఉరుముల మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా HYD పోలీసులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని, అందరూ దీనికి తగ్గట్లు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. భారీ వర్షం కురిసే సమయంలో కరెంట్ స్తంభాలకు దూరంగా ఉండాలని, హెవీ ట్రిఫిక్ ఉండే రోడ్లు అవాయిడ్ చేయాలని సూచించారు.
Similar News
News April 2, 2026
మోస్రా: పల్లె ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్

పల్లెలు, పట్టణాల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. గురువారం మోస్రాలో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే సత్వర ప్రగతి సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News April 2, 2026
ప్రధాని మోదీని కలిసిన MP మాగుంట బృందం

న్యూ ఢిల్లీ పార్లమెంటు భవనంలో ప్రధాని నరేంద్ర మోదీని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, కూటమి ఎంపీల బృందంతో కలిసి నంద్యాల మహిళా MP డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొన్నారు.
News April 2, 2026
గుడ్ న్యూస్: రూ.7,358 కోట్లు దశలవారీ చెల్లింపు

AP: ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.7,358 CR బకాయిల విడుదలకు GOVT చర్యలు చేపట్టింది. CM ఆదేశాలతో చెల్లింపు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. గ్రాట్యుటీ ₹3,411CR, లీవ్ ఎన్క్యాష్మెంటు ₹1800CR ఇవ్వాల్సి ఉండగా నిధుల అందుబాటును అనుసరించి విడుదల చేస్తున్నామంది. ఇప్పటికే PF కింద ₹1,848CR, GLI కింద ₹76CR, పోలీసుల సరెండర్ లీవులకు ₹223CR జమ చేశామని ఫైనాన్స్ విభాగం తెలిపింది.


